Share News

KTR: కేసీఆర్ ఎర్రటి ఎండల్లో.. రేవంత్‌రెడ్డి ఏమో ఐపీఎల్ మ్యాచుల్లో..!

ABN , Publish Date - Apr 06 , 2024 | 03:40 PM

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress) అరచేతిలో వైకుంఠం చూపెట్టి గెలిచిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. శనివారం నాడు రైతు దీక్షకు బీఆర్ఎస్ పిలుపుచ్చింది.

KTR: కేసీఆర్ ఎర్రటి ఎండల్లో.. రేవంత్‌రెడ్డి ఏమో ఐపీఎల్ మ్యాచుల్లో..!

రాజన్న సిరిసిల్ల జిల్లా: మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress) అరచేతిలో వైకుంఠం చూపెట్టి గెలిచిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. శనివారం నాడు రైతు దీక్షకు బీఆర్ఎస్ పిలుపుచ్చింది.

ఈ దీక్షలో కేటీఆర్ పాల్గొని మాట్లాడుతూ... రేవంత్ ప్రభుత్వం దున్న పోతుతో సమానమని ఎద్దేవా చేశారు. రైతులకు రూ.500 బోనస్ ఇవ్వమని అడిగితే ఎలక్షన్ కోడ్ ఉందని అంటున్నారన్నారు. చిత్త శుద్ది ఉంటే ఎలక్షన్ కమిషన్‌కు లెటర్ రాయాలని.. తాము కూడా ఉత్తరం ఇస్తామని చెప్పారు.


Errabelli Dayakar Rao: ఊహాగానాలకు చెక్.. మళ్లీ మార్చేస్తామంటూ ఎర్రబెల్లి సంచలనం..

కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరంలో రెండు పిల్లర్లు రిపేరు చేస్తే తెలంగాణలో కరువు రానే రాదన్నారు. ప్రజలపై ప్రేముంటే ఎన్నికల్లో ఇచ్చినా హామీలను రేవంత్ రెడ్డి నెరవేర్చాలని కోరారు. ప్రతిపక్షంలో ఉన్న కేసీఆర్ ఎర్రటి ఎండలో ప్రజల్లో తిరిగితే.. రేవంత్ రెడ్డి ఐపీఎల్ మ్యాచులు చూస్తున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి గుంపు మేస్త్రి, ప్రధానమంత్రి తాపీ మేస్త్రి అని సెటైర్లు గుప్పించారు.


Uttam Kumar Reddy: షాకింగ్ న్యూస్ చెప్పిన ఉత్తమ్.. అదే జరిగితే..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం...

Updated Date - Apr 06 , 2024 | 03:47 PM