Share News

Ponguleti: ప్రజల వద్దకే శ్రీనన్న కార్యక్రమంలో మంత్రి పొంగులేటి..

ABN , Publish Date - May 19 , 2024 | 10:53 AM

ఖమ్మం జిల్లా: ఖమ్మం రూరల్ మండలం, రెడ్డిపల్లి, పోలేపల్లిలో నిర్వహించిన ప్రజా సమస్యలపై ప్రజల వద్దకే శ్రీనన్న కార్యక్రమంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రజలనుంచి మంత్రి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు.

Ponguleti: ప్రజల వద్దకే శ్రీనన్న కార్యక్రమంలో మంత్రి పొంగులేటి..

ఖమ్మం జిల్లా: ఖమ్మం రూరల్ మండలం, రెడ్డిపల్లి, పోలేపల్లి (Polepalli)లో నిర్వహించిన ప్రజా సమస్యలపై ప్రజల వద్దకే శ్రీనన్న (Srinanna with the people) కార్యక్రమంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రజలనుంచి మంత్రి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. గ్రామాల్లో సమస్యలపై మంత్రి శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రాలు అందజేసిన ప్రజలు. సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని ప్రజలకు మంత్రి శ్రీనివాస్ రెడ్డి తెలియజేశారు.


మీ అందరి దీవెనలతో ఎమ్మెల్యేగా గెలిచానని, తెలంగాణాలో మార్పు కావాలని ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నామని, ఇళ్ళు లేని ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. గ్రామంలో ఉన్న పాఠశాల, రోడ్లు, కమ్యూనిటీ హల్ నిర్మాణం త్వరలోనే పూర్తి చేపిస్తామన్నారు. త్వరలోనే అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు, పెన్షన్లు ఇస్తామన్నారు. పాలేరు నియోజకవర్గం తన సొంత ఇల్లు అని, ఎన్నికల కోడ్ అయిపోగానే నియోజకవర్గంలో అభివృద్ధి పనులు మొదలవుతాయన్నారు. అడిగిన సమస్యలే కాకుండా అడగని సమస్యలు కూడా పరిష్కరిస్తాని చెప్పారు. ప్రజలు అడిగిన కోరికలు తీర్చే బాధ్యత తనదన్నారు. భవిష్యత్‌లో ఏ సమస్య వచ్చినా ఇందిరమ్మ కమిటీ ద్వారా తనకు తెలియచేయాలని, ప్రజలందరూ సంతోషంగా ఉండాలని మీ పెద్ద కొడుకుగా పనిచేస్తానని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

భర్తపై దాడి.. భార్య ప్రతీకారం..

కొడాలి నాని పంచాల్సిన డబ్బులు కొందరు దోచేశారంటూ..

తమిళనాడులో ‘రెడ్ అలర్ట్’ జారీ

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం..

ఇదంతా బురదే కదా అనుకుంటే పొరపాటే..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 19 , 2024 | 11:55 AM