Share News

Ponguleti Srinivas: ఎన్నికల్లో లాభం పొందాలనే ఈ డ్రామాలు

ABN , Publish Date - Mar 16 , 2024 | 12:03 PM

Telangana: మరికొద్ది గంటల్లో పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ రాబోతోందని రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం కూసుమంచిలో సీసీ రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. వేసవికాలంలోనే శంకుస్థాపన చేసిన రోడ్లు పూర్తి చేయాలన్నారు. అందరి దీవెనలతో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందన్నారు.

Ponguleti Srinivas: ఎన్నికల్లో లాభం పొందాలనే ఈ డ్రామాలు

ఖమ్మం, మార్చి 16: మరికొద్ది గంటల్లో పార్లమెంట్ ఎన్నికల (Parliament Elections) షెడ్యూల్ రాబోతోందని రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) అన్నారు. శనివారం కూసుమంచిలో సీసీ రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. వేసవికాలంలోనే శంకుస్థాపన చేసిన రోడ్లు పూర్తి చేయాలన్నారు. అందరి దీవెనలతో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందన్నారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇళ్ళు కట్టిచ్చారని.. గడిచిన ప్రభుత్వం మాటలతో కాలయాపన చేసిందని విమర్శించారు. ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు అవుతుందన్నారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అన్నింటినీ నెరవేరుస్తామని చెప్పారు. త్వరలోనే అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు ఇస్తామని స్పష్టం చేశారు. డ్రామా రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఎన్నికల్లో లాభం పొందాలని కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం... మొన్నటి వరకు అధికారంలో ఉన్న ప్రభుత్వం డ్రామాలడుతున్నాయని ఆరోపించారు. ‘‘మీ అందరి దీవెనలు ఈ ప్రభుత్వనికి ఉండాలని... ఎన్ని కుయుక్తులు పన్నినా మీ కోరికలు నెరవేర్చడానికి ఇందిరమ్మ ప్రభుత్వం సిద్ధంగా ఉంది’’ అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి..

Hyderabad: శంషాబాద్‌ పరిధిలో నేడు, రేపు ట్రాఫిక్‌ ఆంక్షలు.. కారణం ఏంటంటే...

PM Modi: నాగర్‌కర్నూల్‌కు బయలుదేరిన ప్రధాని మోదీ

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 16 , 2024 | 12:18 PM