Share News

నాగర్‌కర్నూల్‌కు బయలుదేరిన ప్రధాని మోదీ

ABN , Publish Date - Mar 16 , 2024 | 11:45 AM

హైదరాబాద్: నిన్న నగరంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ రాత్రికి రాజ్‌భవన్‌లో బస చేశారు. శనివారం ఉదయం ఆయన రాజ్ భవన్ నుంచి బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకుని ప్రత్యేక హెలికాప్టర్‌లో నాగర్‌కర్నూల్‌కు బయలుదారారు.

నాగర్‌కర్నూల్‌కు బయలుదేరిన ప్రధాని మోదీ

హైదరాబాద్: నిన్న నగరంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ (PM Modi) రాత్రికి రాజ్‌భవన్‌ (Raj Bhavan)లో బస చేశారు. శనివారం ఉదయం ఆయన రాజ్ భవన్ నుంచి బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకుని ప్రత్యేక హెలికాప్టర్‌లో నాగర్‌కర్నూల్‌ (Nagarkurnool)కు బయలుదారారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 12:45 గంటల వరకు నాగర్‌కర్నూల్‌ బహిరంగ సభలో మోదీ ప్రసంగించనున్నారు. అనంతరం అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో కర్ణాటక (Karnataka)లోని గుల్బర్గాకు వెళతారు. ఆదివారం ఏపీ (AP)లో జరగనున్న కూటమి సభలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. అక్కడ కార్యక్రమాలు పూర్తి చేసుకుని రాత్రికి హైదరాబాద్‌కు చేరుకుని రాజ్ భవన్‌లో బస చేస్తారు. సోమవారం (18వ తేదీ) జగిత్యాలలో జరగనున్న బీజేపీ బహిరంగ సభలో మోదీ పాల్గొని ప్రసంగిస్తారు.

Updated Date - Mar 16 , 2024 | 11:45 AM