Share News

TG News: మల్లారెడ్డి కాలేజ్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం

ABN , Publish Date - Jul 10 , 2024 | 04:43 PM

మైసమ్మ గూడలో దారుణం జరిగింది. ఓ ప్రైవేట్ హాస్టల్ బిల్డింగ్ మీద నుంచి దూకి మల్లారెడ్డి అగ్రికల్చరల్ యూనివర్శిటీ విద్యార్థి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు.

TG News: మల్లారెడ్డి కాలేజ్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం

మేడ్చల్ జిల్లా : మైసమ్మ గూడలో దారుణం జరిగింది. ఓ ప్రైవేట్ హాస్టల్ బిల్డింగ్ మీద నుంచి దూకి మల్లారెడ్డి అగ్రికల్చరల్ యూనివర్శిటీ విద్యార్థి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో 3వ సంవత్సరం చదివే హరినాథ్ అనే విద్యార్థి పురుగుల మందు తాగి, ఆ పై వసతి గృహం 3వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు.


హాస్టల్ బిల్డింగ్ మీదినుంచి దూకూతుండగా విద్యుత్ వైర్లు తగిలి తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.ప్రాణాపాయ స్థితిలో ఉన్న విద్యార్థి చికిత్స పొందుతున్నాడు. పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థి తల్లిదండ్రులకు పోలీసులు సమాచారం అందించారు. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Updated Date - Jul 10 , 2024 | 04:43 PM