Share News

TG Politics: కిర్గిజ్‌స్థాన్‌లోని తెలంగాణ విద్యార్థుల భద్రతపై చర్యలు తీసుకోవాలి: హరీశ్‌రావు

ABN , Publish Date - May 20 , 2024 | 05:15 PM

కిర్గిజ్‌స్థాన్‌ (Kyrgyzstan) దేశంలో భారత్, పాకిస్తానీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని అక్కడి స్థానికులు దాడులకు తెగబడుతున్నారు. రాజధాని బిష్కెక్‌లో గత రెండు రోజులుగా స్థానికులు, విదేశీ విద్యార్థులకు మధ్య ఘర్షణలు తలెత్తుతున్నాయి.

TG Politics: కిర్గిజ్‌స్థాన్‌లోని తెలంగాణ విద్యార్థుల భద్రతపై చర్యలు తీసుకోవాలి: హరీశ్‌రావు
Harish Rao

హైదరాబాద్: కిర్గిజ్‌స్థాన్‌ (Kyrgyzstan) దేశంలో భారత్, పాకిస్తానీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని అక్కడి స్థానికులు దాడులకు తెగబడుతున్నారు. రాజధాని బిష్కెక్‌లో గత రెండు రోజులుగా స్థానికులు, విదేశీ విద్యార్థులకు మధ్య ఘర్షణలు తలెత్తుతున్నాయి. అక్కడ తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు కూడా చాలా మంది ఉన్నారు.

తెలంగాణలోని విద్యార్థులు కూడా చదువుతున్నారు. అక్కడ ఉన్న పరిస్థితులపై ట్విట్టర్(ఎక్స్) వేదికగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు (Harish Rao) ఓ ట్వీట్ చేశారు. కిర్గిజ్‌స్థాన్‌లోని తెలంగాణ విద్యార్థుల భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.


ఆ సంఘటనలతో తీవ్ర ఆందోళన..

‘‘కిర్గిజ్‌స్థాన్‌ రాజధాని బిష్క్‌క్‌లోని భారతీయ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని జగుతున్న హింసాత్మక సంఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. హింసలో పలువురు భారతీయ విద్యార్థులు గాయపడ్డారు. భారతీయ విద్యార్థులతోపాటు వివిధ దేశాల విద్యార్థులపై స్థానికులు దాడులు చేయడంతో పరిస్థితి దిగజారింది. కిర్గిజ్‌లోని తెలంగాణ విద్యార్థుల భద్రత కోసం వెంటనే పటిష్ట చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయాన్ని, భారత ప్రభుత్వ అధికారులను గౌరవనీయులైన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్‌ని, బిష్కెక్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని కోరుతున్నాను. ఈ సంక్షోభాన్ని గట్టెక్కడానికి, విద్యార్థుల భద్రతపై వారి కుటుంబాలకు భరోసా ఇవ్వడానికి దౌత్యపరంగా పటిష్ట చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది’’ అని హరీశ్‌రావు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Kyrgyzstan :మేం భారత్‌కు తిరిగి వచ్చేస్తాం!

Kyrgyzstan: కిర్గిస్థాన్‌లోని విద్యాసంస్థలకు భారత ఎంబసీ లేఖ.. వారిని తిరిగి పంపాలని సూచన

Kyrgyzstan: కిర్గిజ్‌స్థాన్‌లో దాడులు.. బయటకు రావొద్దంటూ భారత విద్యార్థులకు కేంద్రం హెచ్చరిక

Kyrgyzstan: కిర్గిజ్‌స్థాన్‌లో భారత్, పాక్ విద్యార్థులపై దాడులు.. రాయబార కార్యాలయం అలర్ట్

Updated Date - May 20 , 2024 | 05:23 PM