Share News

Congress: నేడు ఢిల్లీలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం

ABN , Publish Date - Mar 27 , 2024 | 08:46 AM

నేడు ఢిల్లీలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగనుంది. దీనికి తెలంగాణ సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఈసీ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరుకానున్నారు. తెలంగాణలో పెండింగ్ స్థానాలపై చర్చ జరగనుంది. ఇప్పటికే 2 దఫాల్లో 9 మందిని ఏఐసీసీ ప్రకటించింది.

Congress: నేడు ఢిల్లీలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం

ఢిల్లీ: నేడు ఢిల్లీలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ (Central Election Committee) సమావేశం జరగనుంది. దీనికి తెలంగాణ (Telangana) సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka), సీఈసీ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) హాజరుకానున్నారు. తెలంగాణలో పెండింగ్ స్థానాలపై చర్చ జరగనుంది. ఇప్పటికే 2 దఫాల్లో 9 మందిని ఏఐసీసీ ప్రకటించింది. 8 స్థానాలపై ఈరోజు చర్చించి సీఈసీ నిర్ణయం తీసుకోనుంది. 8 స్థానాల్లో ఐదు స్థానాలపై ఒక అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం. మూడు స్థానాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఖమ్మం (Khammam), భువనగిరి, నిజామాబాద్ (Nizamabad) స్థానాలపై కాంగ్రెస్ నేతలు కుస్తీ పడుతున్నారు.

రెఫరెండమే!

ఖమ్మం నుంచి పొంగులేటి ప్రసాద్ రెడ్డి, మల్లు నందిని, తుమ్మల యుగంధర్, రాజేంద్ర ప్రసాద్‌లు టికెట్ ఆశిస్తున్నారు. భువనగిరి నుంచి టికెట్ కోసం చామల కిరణ్, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, గుత్తా అమిత్, కోమటి రెడ్డి ఫ్యామిలీ ప్రయత్నాలు చేస్తోంది. నిజామబాద్ టికెట్ బరిలో జీవన్ రెడ్డి, సునీల్ రెడ్డి, అనిత రెడ్డి ఉన్నారు. ఈ రోజు రాత్రికి అన్ని స్థానాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అభ్యర్థుల ప్రకటన తర్వాత పూర్తిగా గ్రౌండ్‌లోనే హస్తం శ్రేణులు ఉండనున్నాయి. పార్లమెంట్ స్థానాల వారీగా సమీక్షలు చేస్తూ రేవంత్ దిశానిర్దేశం చేస్తున్నారు. పార్టీ స్ట్రాటజీపై ముఖ్య నేతలతో చర్చించనున్నారు. టార్గెట్ 14 రీచ్ అవ్వాల్సిందేనని రేవంత్ అంటున్నారు.

Phone Tapping: ట్యాపింగ్‌ మంటలు.. అగ్రనేతల కన్నెర్ర..!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 27 , 2024 | 08:46 AM