Share News

Hyderabad: బీజేపీ గెలిచే 400 స్థానాల్లో హైదరాబాద్‌ ఉండాలి

ABN , Publish Date - May 08 , 2024 | 09:42 AM

పార్లమెంట్‌ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ గెలిచే 400 స్థానాల్లో హైదరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం కూడా ఉండాలని రాజస్థాన్‌ ముఖ్యమంత్రి భజన్‌లాల్‌శర్మ(Rajasthan Chief Minister Bhajanlal Sharma) ప్రజలను కోరారు.

Hyderabad: బీజేపీ గెలిచే 400 స్థానాల్లో హైదరాబాద్‌ ఉండాలి

హైదరాబాద్: పార్లమెంట్‌ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ గెలిచే 400 స్థానాల్లో హైదరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం కూడా ఉండాలని రాజస్థాన్‌ ముఖ్యమంత్రి భజన్‌లాల్‌శర్మ(Rajasthan Chief Minister Bhajanlal Sharma) ప్రజలను కోరారు. హైదరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి మాధవీలత(Madhavilatha)కు మద్దతుగా బేగంబజార్‌ ఛత్రీ చౌరస్తా నుంచి ఓపెన్‌ టాప్‌ జీపులో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి: BJP: తెలంగాణలో 10 లక్షల కోట్ల అభివృద్ధి..

అనంతరం బర్తన్‌బజార్‌ చౌరస్తాలో ఆయన మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. గోషామహల్‌ నియోజకవర్గం నుంచి 100శాతం పోలింగ్‌ జరిగేలా చూడాలని, మాధవీలతను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గోల్కొండ(Golconda) జిల్లా బీజేపీ అధ్యక్షుడు వి.పాండుయాదవ్‌, బీజేపీ శాసనసభాపక్ష నాయకులు జి.శంకర్‌యాదవ్‌, గోషామహల్‌ నియోజకవర్గ బీజేపీ కన్వీనర్‌ ఎం.కృష్ణ, గోషామహల్‌ కార్పొరేటర్‌ లాల్‌సింగ్‌, అవినాష్‌దేవ్లా, రామకృష్ణ పాల్గొన్నారు.

city2.jpg

ఇదికూడా చదవండి: Hyderabad: హైదరాబాద్‌లో ఘోరం.. గోడకూలి ఏడుగురి మృతి.. జేసీబీలతో మృతదేహాలు వెలికితీత

Read Latest Telangana News and National News

Read Latest National News and Telugu News

Updated Date - May 08 , 2024 | 09:42 AM