Share News

Ts Police: సినీ నిర్మాత హత్య కేసు ఎఫెక్ట్.. ఏసీపీ సుధీర్ బాబు సస్పెండ్

ABN , Publish Date - Feb 02 , 2024 | 08:12 AM

సినీ నిర్మాత అంజిరెడ్డి హత్య కేసు విచారణలో పోలీసుల విచారణ తీరుపై అనుమానాలు వచ్చాయి. ఊహించినట్టుగానే నిర్మాత అంజిరెడ్డి రోడ్డు ప్రమాదంలో చనిపోలేదని తెలిసింది. హత్య చేసి దానిని ప్రమాదంగా చిత్రీకరించారని ఆ తర్వాత జరిపిన విచారణలో తేటతెల్లం అయ్యింది. దీంతో గోపాలపురం ఏసీపీ సుధీర్ బాబును సస్పెండ్ చేశారు

Ts Police: సినీ నిర్మాత హత్య కేసు ఎఫెక్ట్.. ఏసీపీ సుధీర్ బాబు సస్పెండ్

హైదరాబాద్: సినీ నిర్మాత అంజిరెడ్డి (Anji Reddy) హత్య కేసు విచారణలో పోలీసుల విచారణ తీరుపై అనుమానాలు వచ్చాయి. ఊహించినట్టుగానే నిర్మాత అంజిరెడ్డి రోడ్డు ప్రమాదంలో చనిపోలేదని తెలిసింది. హత్య చేసి దానిని ప్రమాదంగా చిత్రీకరించారని ఆ తర్వాత జరిపిన విచారణలో తేటతెల్లం అయ్యింది. దీంతో గోపాలపురం ఏసీపీ సుధీర్ బాబుపై చర్యలు తీసుకున్నారు. సుధీర్ బాబును హైదరాబాద్ పోలీస్ కమీషనర్ కే శ్రీనివాస రెడ్డి సస్పెండ్ చేశారు. అంతకుముందే గోపాలపురం ఇన్ స్పెక్టర్ మురళి, డీఎస్ఐ దీక్షితులను సస్పెండ్ చేశారు. నిర్మాత అంజిరెడ్డికి రియల్ ఎస్టేట్ మాఫియాతో గొడవలు ఉన్నాయి. భూ వివాద విషయంలో వివాదం కొనసాగుతోంది. దాంతో రియల్ ఎస్టేట్ మాఫియా అంజిరెడ్డిని హతమార్చింది. గోపాలపురం ఏసీపీని రియల్ మాఫియా తమ వైపునకు తిప్పుకుంది. అంజిరెడ్డి హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు. కుటుంబ సభ్యులు అంజిరెడ్డి మృతిపై సందేహాలు వ్యక్తం చేయడంతో కేసును మరోసారి దర్యాప్తు చేశారు. అంజిరెడ్డి హత్యకు గల కారణాలు తెలిశాయి. హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారని వెల్లడైంది. దీంతో ఏసీపీ సుధీర్ బాబును సస్పెండ్ చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 02 , 2024 | 08:12 AM