Home » Suspension
పచ్చిరొట్ట విత్తనాలు పక్కదారి పట్టిన వ్యవహారంలో విచారణాధికారి తప్పుడు నివేదికను ఇచ్చారని.. అందులో తమకు ఎలాంటి ప్రమేయం లేదని సస్పెండైన ఏఈవోలు అరవింద్, జమున, దీపిక మహబూబాబాద్ జిల్లా వ్యవసాయాధికారికి శనివారం లేఖ రాశారు.
రేవ్ పార్టీ కేసులో అరెస్టైన నటి హేమపై మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (‘మా’) కమిటీ క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఆమె దోషిగా తేలితే చర్యలు తప్పవని ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు ఇటీవల పేర్కొన్నారు. అందులో భాగంగా ఆయన కమిటీ సభ్యులు అభిప్రాయాలను కోరినట్లు తెలిసింది.
కారంపూడి సీఐ నారాయణస్వామి(CI Narayana Swamy)పై ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. నారాయణస్వామిని విధులకు దూరంగా ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. కారంపూడిలో సీఐ నారాయణస్వామి శాంత్రిభద్రతలు కాపాడటంలో విఫలమయ్యారని, తనపై తప్పుడు కేసులు పెట్టారంటూ ఏపీ హైకోర్టు(AP High Court)ను పిన్నెల్లి ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం సీఐను విధులకు దూరంగా ఉంచాలని సీఈవో ముకేశ్ కుమార్ మీనాను ఆదేశించారు. దీంతో సీఐ నారాయణస్వామిని విధుల నుంచి ఈసీ తప్పించింది.
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావుపై ఉన్న సస్పెన్షన్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎత్తివేయనుంది. ఐదేళ్ల క్రితం జగన్ సర్కార్ ఏర్పడిన వెంటనే ఏవీబీపై కక్షగట్టిన సంగతి తెలిసిందే. దాంతో ఏబీవీ క్యాట్ను ఆశ్రయించగా సస్పెన్షన్ ఎత్తివేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సూచించింది. దానిని జగన్ సర్కార్ హైకోర్టులో సవాల్ చేసింది. క్యాట్ ఉత్తర్వులపై జోక్యం చేసుకోబోమని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. దాంతో ఏపీ సర్కార్ ఏబీవీపై ఉన్న సస్పెన్షన్ ఎత్తి వేయాలని నిర్ణయం తీసుకుంది.
కక్ష సాధించడంలో ముఖ్యమంత్రి జగన్కు మించినవారు ఉండరేమో? ఎంత పెద్ద రాజకీయ నాయకుడైనా, బ్యూరోక్రాట్ అయినా సరే ఆయన టార్గెట్ చేస్తే విలవిలలాడి పోవాల్సిందే.
విజయవాడ: నగరంలో కలుషిత నీరు సరఫరా ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై వేటుపడింది. ఆరుగురు వీఎంసీ అధికారులను సస్పెండ్ చేయగా మరో ఇద్దరు అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మొగల్రాజపురంలో కలుషిత నీరు తాగి వ్యక్తి మృతి చెందగా.. తీవ్ర అస్వస్థతకు గురైన 24 మందికి చికిత్స కొనసాగుతోంది.
ఆ ఇద్దరూ శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లు! వీరిలో ఒకరు మహిళా పారిశుఽధ్య కార్మికులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఆ దృశ్యాలను తనకు తానే ఫోన్లో వీడియో తీస్తాడు. తర్వాత ఆ వీడియోలను బాధిత మహిళలకు చూపి లైంగిక వేధింపులకు గురిచేస్తాడు.
గాజులరామారంలో ఫీల్డ్ ఆఫీసర్ కిషన్ లీలలు వెలుగులోకి వచ్చాయి. ఓ మహిళ పారిశుద్ద్య సిబ్బందిని లైంగికంగా వేధించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. బాధిత మహిళకు సంబంధించిన వీడియోలు కూడా బయటకు వచ్చాయి. దాంతో బాధితురాలు మీడియా ముందుకు వచ్చి జరిగిన మొత్తం చెప్పింది. మహిళను వేధించిన ఫీల్డ్ ఆఫీసర్పై గ్రేటర్ అధికారులు చర్యలు తీసుకున్నారు.
అక్రమాలకు పాల్పడిన ఇద్దరు మునిసిపల్ కమిషనర్లను సస్పెండ్ చేస్తూ బుధవారం అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. నిర్మల్ పురపాలక సంఘంలో జరిగిన పబ్లిక్ హెల్త్ వర్కర్ల నియామకాలకు సంబంధించి అప్పటి నిర్మల్ మునిసిపల్ కమిషనర్, ప్రస్తుత తుర్కయాంజల్ మునిసిపల్ కమిషనర్ బి. సత్యనారాయణ రెడ్డిని అధికారులు తొలగించారు.
పతంజలికి మరో షాక్ తగిలింది. పతంజలికి చెందిన 14 ఉత్పత్తులపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. పతంజలి ఉత్పత్తులకు సంబంధించి తప్పుదారి ప్రకటించే కేసు విషయంలో సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం తెలియజేసింది.