Share News

Bura Narsaiah: బీఆర్‌ఎస్, బీజేపీ ఒక్కటే అన్న వారిని చెప్పుతో కొడతాం

ABN , Publish Date - Mar 14 , 2024 | 11:56 AM

Telangana: బీఆర్‌ఎస్, బీజేపీ రెండు పార్టీలు ఒక్కటే అన్న వారిని చెప్పుతో కొడతామని భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గురువారం చౌటుప్పల్ మండలం ఆరెగూడెం, లింగోజి గూడెం గ్రామాల్లో బూర నర్సయ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ‘‘నాకంటే ముందున్న ఎంపీలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు భువనగిరి పార్లమెంట్లో అభివృద్ధిపై చర్చకు సిద్ధమా’’ అంటూ సవాల్ విసిరారు.

Bura Narsaiah: బీఆర్‌ఎస్, బీజేపీ ఒక్కటే  అన్న వారిని చెప్పుతో కొడతాం

యాదాద్రి, మార్చి 14: బీఆర్‌ఎస్ (BRS), బీజేపీ (BJP) రెండు పార్టీలు ఒక్కటే అన్న వారిని చెప్పుతో కొడతామని భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ (BJP MP Candidate Bura Narsaiah Goud) ఘాటు వ్యాఖ్యలు చేశారు. గురువారం చౌటుప్పల్ మండలం ఆరెగూడెం, లింగోజి గూడెం గ్రామాల్లో బూర నర్సయ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘‘నాకంటే ముందున్న ఎంపీలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు భువనగిరి అభివృద్ధిపై పార్లమెంట్‌లో చర్చకు సిద్ధమా. భువనగిరిలో బీజేపీ గెలవకపోతే శాశ్వతంగా రాజకీయ సన్యాసం చేస్తా. నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ మంత్రి పదవికి రాజీనామా చేస్తావా కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు వర్తమానంలో లేదు.. భవిష్యత్తులో కూడా ఉండదు’’ అంటూ బూర నర్సయ్య గౌడ్ స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి...

Vijayadharani: నేను ఎమ్మెల్యేగా పోటీ చేయడం లేదు.. బీజేపీ అధిష్థానం ఎంపీ సీటిస్తే కచ్చితంగా పోటీ..

CM Jagan: అమ్మో సీఎం పర్యటనా!.. హడలెత్తిపోతున్న బనగానపల్లె ప్రజలు


మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 14 , 2024 | 11:56 AM