Share News

Anant Radhika Wedding: అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు.. పీఎస్‌ఎల్ మధ్యలో నుంచే వచ్చేసిన పొలార్డ్

ABN , Publish Date - Mar 02 , 2024 | 01:15 PM

ప్రముఖ పారిశ్రామికవేత్త రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడి వివాహానికి సంబంధించిన ప్రీ వెడ్డింగ్ వేడుకలు శుక్రవారం గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఘనంగా ప్రారంభమయ్యాయి. అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో పాల్గొనడానికి దేశ విదేశాల్లోని అతిథులు తరలివచ్చారు.

Anant Radhika Wedding: అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు.. పీఎస్‌ఎల్ మధ్యలో నుంచే వచ్చేసిన పొలార్డ్

ప్రముఖ పారిశ్రామికవేత్త రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ (Mukesh Ambani) చిన్న కుమారుడి వివాహానికి సంబంధించిన ప్రీ వెడ్డింగ్ వేడుకలు శుక్రవారం గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఘనంగా ప్రారంభమయ్యాయి. అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో పాల్గొనడానికి దేశ విదేశాల్లోని అతిథులు తరలివచ్చారు. అనేక మంది పారిశ్రామికవేత్తలు, సెలబ్రెటీలు, క్రీడాకారులు, చాలా మంది ప్రముఖులు ఈ వేడకలకు హాజరయ్యారు. మార్చి 1న ప్రారంభమైన ఈ వేడుకలు 3 వరకు జరగనున్నాయి. అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో అనేక మంది విదేశీ క్రికెటర్లు కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా వెస్టిండీస్ మాజీ క్రికెటర్ కీరన్ పొలార్డ్ (Kieron Pollard) పాకిస్థాన్ సూపర్ లీగ్‌ నుంచి మధ్యలో వచ్చి ఈ వేడుకలకు హాజరు కావడం గమనార్హం. ప్రస్తుతం పాకిస్థాన్ వేదికగా పీఎస్‌ఎల్ 2024 టోర్నీ జరుగుతోంది. ఈ టోర్నీలో కీరన్ పొలార్డ్ కరాచీ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.


కానీ అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు ఆహ్వానం అందడంతో మార్చి 1న జామ్‌నగర్ చేరుకున్నాడు. వేడుకలు ముగిసిన అనంతరం తిరిగి పాకిస్థాన్ వెళ్లనున్నాడు. పీఎస్‌ఎల్ లీగ్‌లో పాల్గొననున్నాడు. ముల్తాన్ సుల్తాన్స్‌తో కరాచీ కింగ్స్‌ ఆడే తర్వాతి మ్యాచ్ నాటికి జట్టులో చేరనున్నాడు. ఈ మ్యాచ్ ఆదివారం జరగనుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో కరాచీ కింగ్స్ ఐదో స్థానంలో ఉంది. కాగా ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ యాజమాన్యంలోని ముంబైకి చెందిన అనేక క్రికెట్ ప్రాంచైజీలకు పొలార్డ్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్‌లో ఆటగాడిగా ఆడినంత కాలం ముంబై ఇండియన్స్‌కే ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్ నుంచి రిటైర్ అయ్యాక కూడా ఆ ఫ్రాంచైజీలో బ్యాటింగ్ కోచ్‌గా పనిచేస్తున్నాడు. అలాగే సౌతాఫ్రికా టీ20, ఐఎల్‌టీ20లో ముంబై జట్లకే పొలార్డ్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఆయా లీగ్‌ల్లో పొలార్డ్ ఆటగాడిగానే కొనసాగుతున్నాడు. పొలార్డుతోపాటు అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు హాజరైన విదేశీ క్రీడాకారుల్లో ఆస్ట్రేలియాకు చెందిన టిమ్ డేవిడ్, న్యూజిలాండ్‌కు చెందిన ట్రెంట్ బోల్ట్, వెస్టిండీస్‌కు చెందిన డ్వేన్ బ్రావో, నికోలస్ పూరన్, అప్ఘానిస్తాన్‌కు చెందిన రషీద్ ఖాన్, ఇంగ్లండ్‌కు చెందిన సామ్ కర్రాన్ తదితరులు ఉన్నారు. ఇక టీమిండియా క్రికెటర్ల విషయానికొస్తే కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, మాజీ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోని, జహీర్ ఖాన్ తదితరులు ఉన్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 02 , 2024 | 01:17 PM