Share News

బోర్డు మంచి పనే చేసింది

ABN , Publish Date - Mar 02 , 2024 | 01:25 AM

రంజీల్లో ఆడనందుకు ఇషాన్‌ కిషన్‌, శ్రేయాస్‌ అయ్యర్‌కు సెంట్రల్‌ కాంట్రాక్ట్‌లు నిరాకరించడాన్ని దిగ్గజ ఆల్‌రౌండర్‌ కపిల్‌ దేవ్‌ సమర్థించాడు.

బోర్డు మంచి పనే చేసింది

న్యూఢిల్లీ: రంజీల్లో ఆడనందుకు ఇషాన్‌ కిషన్‌, శ్రేయాస్‌ అయ్యర్‌కు సెంట్రల్‌ కాంట్రాక్ట్‌లు నిరాకరించడాన్ని దిగ్గజ ఆల్‌రౌండర్‌ కపిల్‌ దేవ్‌ సమర్థించాడు. దేశంకన్నా ఎవరూ పెద్దవారు కాదని, బీసీసీఐ చర్య కొంతమందికి బాధ కలిగించినా ఫర్వాలేదని తేల్చి చెప్పాడు. ‘దేశవాళీ క్రికెట్‌ ఉనికిని కాపాడేందుకు బోర్డు తీసుకుంటున్న చర్యలు అభినందనీయం. అంతర్జాతీయ క్రికెట్‌లో ఎదిగాక కొంతమంది ఆటగాళ్లు రంజీలను విస్మరించడం శోచనీయం’ అని కపిల్‌ అన్నాడు.

Updated Date - Mar 02 , 2024 | 01:25 AM