నిర్మల్ జిల్లాలో రాహుల్, రేవంత్ రెడ్డి జన జాతర సభ..
ABN, Publish Date - May 06 , 2024 | 11:14 AM
నిర్మల్ జిల్లా: కేంద్రంలో ‘ఇండియా’ కూటమి అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా ప్రతి పేద కుటుంబం నుంచి ఓ మహిళను గుర్తించి ఏడాదికి రూ.లక్ష చొప్పున ఖాతాల్లో వేస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు. గత పదేళ్లలో మోదీ ప్రభుత్వం దేశంలోని 22 బడా కుటుంబాల ప్రయోజనాల కోసమే పనిచేసిందని, పేద ప్రజలను ఏమాత్రం పట్టించుకోలేదని.. ‘ఇండియా’ కూటమి మాత్రం దేశవ్యాప్తంగా కోట్లలో ఉన్న నిరుపేదలను లక్షాధికారులుగా మార్చేందుకు ప్రత్యేక పథకాన్ని రూపొందించిందని పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం నిర్మల్ జిల్లా కేంద్రంలో, గద్వాల జిల్లా అలంపూర్లో జరిగిన జనజాతర సభల్లో రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు.
1/7
నిర్మల్ జిల్లా, జన జాతర సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి.. ప్రజలకు అభివాదం తెలుపుతున్న రాహుల్.. ఇంకా మంత్రి సీతక్క, ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ తదితరులను చూడవచ్చు.
2/7
నిర్మల్ జిల్లాలో ఆదివారం జన జాతర సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రసంగిస్తున్న దృశ్యం.
3/7
నిర్మల్ జిల్లా, జన జాతర సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తున్న దృశ్యం..
4/7
నిర్మల్ కేంద్రంలోజరిగిన జాతర సభకు మండుటెండను కూడా లెక్కచేయకుండ వచ్చిన జనసందోహం..
5/7
గద్వాల జిల్లా, ఎర్రవల్లిలో ఆదివారం జరిగిన జన జాతర సభకు ముఖ్య అతిథిగా పాల్గొన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రసంగిస్తున్న దృశ్యం. ప్రక్కన కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి మల్లు రవి, తదితరులు..
6/7
గద్వాల జిల్లా, ఎర్రవల్లిలో ఎన్నికల ప్రచారం జన జాతర సభలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి..
7/7
జోగులాంబ గద్వాల జిల్లా, ఎర్రవల్లిలో, జన జాతర సభలో ప్రసంగిస్తున్న నాగర్ కర్నూల్ జిల్లా కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి మల్లు రవి..
Updated at - May 06 , 2024 | 11:14 AM