CHANDRABABU: చంద్రబాబు నివాసంలో రాజశ్యామల యాగం
ABN, Publish Date - Feb 16 , 2024 | 05:20 PM
తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని నివాసంలో శుక్రవారం రాజశ్యామల యాగం చేపట్టారు. నేటి నుంచి మూడు రోజుల పాటు ఈ యాగం జరగనుంది. ఇందులో భాగంగా మొదటి రోజు జరిగిన పూజా కార్యక్రమాలు, యాగ క్రతువులో చంద్రబాబు - భువనేశ్వరి దంపతులు పాల్గొన్నారు. 50 మంది రిత్వికులు యాగ నిర్వహణలో పాల్గొన్నారు. రాజశ్యామల యాగంలో భాగంగా మూడు రోజుల పాటు పలు రకాల పూజలు, క్రతువులు నిర్వహించనున్నారు. ఆదివారం పూర్ణాహుతితో ఈ యాగం ముగియనుంది. చంద్రబాబు కొద్దిరోజుల క్రితం శత చండి యాగం, మహా సుదర్శన హోమం చేపట్టిన విషయం తెలిసిందే.
![CHANDRABABU: చంద్రబాబు నివాసంలో రాజశ్యామల యాగం](https://media.andhrajyothy.com/media/2024/20240215/CBN_6_341cf237db.jpg)
చంద్రబాబుకు తిలకం దిద్దుతున్న బ్రాహ్మణులు
![CHANDRABABU: చంద్రబాబు నివాసంలో రాజశ్యామల యాగం](https://media.andhrajyothy.com/media/2024/20240215/CBN_4_80e4e4920e.jpg)
రాజశ్యామల యాగంలో చంద్రబాబు దంపతులు
![CHANDRABABU: చంద్రబాబు నివాసంలో రాజశ్యామల యాగం](https://media.andhrajyothy.com/media/2024/20240215/CBN_1_15e62c0ec0.jpg)
యాగ నిర్వహణలో బ్రాహ్మణులు
![CHANDRABABU: చంద్రబాబు నివాసంలో రాజశ్యామల యాగం](https://media.andhrajyothy.com/media/2024/20240215/CBN_7_49c9acceb4.jpg)
వేదమంత్రాలు చదువుతున్న బ్రాహ్మణులు
Updated at - Feb 16 , 2024 | 05:31 PM