Share News

Elections 2024: మణిపుర్ ఎన్నటికీ భారత్‌లో అంతర్భాగమే.. అమిత్ షా కీలక ప్రకటన..

ABN , Publish Date - Apr 15 , 2024 | 05:58 PM

చొరబాటు ద్వారా మణిపుర్ జనాభాను మార్చే ప్రయత్నాలు జరిగాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ( Amit Shah ) సంచలన ప్రకటన చేశారు. మణిపుర్ ను విచ్ఛిన్నం చేసే శక్తులు, ఐక్యం చేసే శక్తుల మధ్య లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు.

Elections 2024: మణిపుర్ ఎన్నటికీ భారత్‌లో అంతర్భాగమే.. అమిత్ షా కీలక ప్రకటన..

చొరబాటు ద్వారా మణిపుర్ జనాభాను మార్చే ప్రయత్నాలు జరిగాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ( Amit Shah ) సంచలన ప్రకటన చేశారు. మణిపుర్ ను విచ్ఛిన్నం చేసే శక్తులు, ఐక్యం చేసే శక్తుల మధ్య లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు. ఎవరి ఎన్ని కుట్రలు చేసినా మణిపుర్ ను దేశం నుంచి వేరు చేసేందుకు తాము ఎన్నటికీ ఒప్పుకోబోమని స్పష్టం చేశారు. ఇంఫాల్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో అమిత్ షా ఈ కామెంట్లు చేశారు. రాష్ట్రంలో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ వెల్లడించారు.


YS Sunitha: అన్ని సాక్ష్యాలున్నా న్యాయం చేయడంలో జాప్యం.. వైఎస్ సునీత సంచలన ప్రెస్ మీట్

షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ) హోదా కోసం మైతేయి డిమాండ్‌కు వ్యతిరేకంగా కొండ జిల్లాల్లో గిరిజన సంఘీభావ యాత్ర జరిగింది. గతేడాది మే 3న జరిగిన ఈ సంఘటన తీవ్ర హింసాత్మకంగా మారింది. ఘర్షణలు చెలరేగి 219 మంది మృతి చెందారు. మహిళలను వివస్త్రలు చేసి నగ్నంగా ఊరేగించిన వీడియోలు దేశ వ్యాప్తంగా పెను దుమారం రేపాయి. మహిళలపై అత్యాచారం, దాడులతో మణిపుర్ అట్టుడికిపోయింది.


Ayodhya: అయోధ్యలో రద్దీ నియంత్రణకు టీటీడీ సహాయం.. నివేదిక సమర్పణ..

గత వారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అస్సాంకు చెందిన ఒక వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ రాష్ట్రంలో పరిస్థితి మెరుగుపడిందని చెప్పారు. వివాదాన్ని పరిష్కరించేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నామన్నారు. దేశమంతా వారి వైపే ఉందని మణిపుర్ ప్రజలకు భరోసా ఇచ్చారు. అందరం కలిసి ఈ సమస్యను పరిష్కరిస్తామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Apr 15 , 2024 | 06:00 PM