Share News

Ayodhya: అయోధ్య రామాలయాన్ని పేల్చేస్తాం.. సీఎంకు బెదిరింపులు.. కట్ చేస్తే..

ABN , Publish Date - Jan 04 , 2024 | 02:07 PM

అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ శుభ ఘడియలు ముంచుకొస్తున్న తరుణంలో.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు బాంబు బెదిరింపులు రావడం దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.

Ayodhya: అయోధ్య రామాలయాన్ని పేల్చేస్తాం.. సీఎంకు బెదిరింపులు.. కట్ చేస్తే..

అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ శుభ ఘడియలు ముంచుకొస్తున్న తరుణంలో.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు బాంబు బెదిరింపులు రావడం దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. యోగి ఆదిత్యనాథ్‌ తో పాటు, త్వరలో ప్రారంభం కానున్న రామ మందిరాన్నీ పేల్చేస్తామని బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో గోండాకు చెందిన తాహర్ సింగ్, ఓం ప్రకాష్ మిశ్రా అనే ఇద్దరు యువకులను అరెస్టు చేశారు. వీరిద్దరూ పారామెడికల్‌ ఇనిస్టిట్యూట్‌లో పని చేస్తున్నారని తెలిపారు. తాహర్‌ సింగ్‌ మొయిల్స్‌ను సృష్టించగా.. ప్రకాశ్‌ బెదిరింపులకు పాల్పడినట్టు తెలుస్తోంది.

వీరిద్దరూ నవంబర్‌లో X ( ట్విట్టర్) లో @iDevendraOffice అనే హ్యాండిల్‌ ను ఉపయోగించి.. సీఎం యోగి ఎస్టీఎఫ్ చీఫ్ అమితాబ్ యశ్, అయోధ్యలోని రామ మందిరాన్ని పేల్చేస్తామని ఈ మెయిల్ ద్వారా పంపించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. అయితే.. ఈ మెయిల్స్‌ను పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐకి చెందిన అధికారిగా చెప్పుకునే జుబేర్ ఖాన్ అనే వ్యక్తికి చెందినట్లు భావిస్తున్నారు. ఈ క్రమంలో లక్నోలోని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నివాసం వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు.

Updated Date - Jan 04 , 2024 | 02:10 PM