Home » Yogi Adityanath
ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న మంత్రివర్గ విస్తరణను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదివారంనాడు చేపట్టారు. ఆరుగురు కొత్త మంత్రులను తన క్యాబినెట్లోకి తీసుకున్నారు.
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ మంత్రివర్గ విస్తరణ జరుగనుందనే ఊహాగానాల నేపథ్యంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శనివారం సాయంత్ర 6.30 గంటలకు గవర్నర్ ఆనందిబెన్ పటేల్ను కలుసుకోనున్నారు. మంత్రివర్గ విస్తరణలో కొత్తగా ఆరుగురికి చోటు కల్పించే అవకాశం ఉంది.
మహిళా రిజర్వేషన్ చట్ట సవరణ బిల్లు లోక్సభలో వీగిపోవడంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) విపక్షాలపై నిప్పులు చెరిగారు. విపక్షాలు మహిళా వ్యతిరేకులని, మహిళలకు రాజకీయ సాధికారత కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లును అడ్డుకునేందుకు ఉద్దేశపూర్వకంగా కుట్ర చేశారని ఆరోపించారు.
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆసక్తికర ఘట్టం చోటుచేసుకుంది. కాంతి పార్లమెంటరీ నియోజకవర్గంలో ప్రచారానికి వచ్చిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు బెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారి పాదాభివందనం చేశారు.
శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 26,27 తేదీలను సెలవు దినాలుగా ప్రకటించింది. 26వ తేదీని శ్రీరామనవమి సెలవు దినంగా ఇప్పటికే ప్రకటించగా, తాజాగా 27వ తేదీకి కూడా సెలవును పొడిగించింది.
అయోధ్యలో బాబ్రీ మసీదు పునర్నిర్మాణం అసాధ్యమని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. బారాబంకిలోని శ్రీరామ్ జానకి ఆలయంలో మంగళవారంనాడు జరిగిన 10వ శ్రీ హనుమాన్ విరాట్ మహాయజ్ఞం, శ్రీ రామార్చా పూజా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
యోగి ఆదిత్యనాథ్పై అవిముక్తేశ్వరానంద స్వామి బహిరంగ యుద్ధం ప్రకటించారు. యోగి తాను హిందువునని నిరూపించుకోవాలని సవాలు చేశారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్పై జ్యోతిర్మఠ్ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద్ సరస్వతి చేసిన విమర్శలను వ్యతిరేకిస్తూ అయోధ్య జీఎస్టీ శాఖ డిప్యూటీ కమిషనర్ ప్రశాంత్ కుమార్ సింగ్ రాజీనామా చేశారు.
ఉత్తరప్రదేశ్లో మంత్రివర్గ విస్తరణ జరుగునుందనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ ఢిల్లీలో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీని ఆయన కలుసుకున్నారు.
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అఖిలేష్ యాదవ్ హయాంలో తెచ్చిన మదర్సా టీచర్లకు పోలీసు చర్యల నుంచి రక్షణ ఇచ్చే చట్టం రద్దు చేశారు. దీంతో మదర్సా సిబ్బందిపై అక్రమాలు వెలుగులోకి వస్తే నేరుగా చర్యలు తీసుకునే అధికారం..