Home » Yogi Adityanath
అయోధ్య రామమందిర విరాళాల అపహరణ కుంభకోణంపై యూపీ సీఎం యోగి ఘాటుగా స్పందించారు. 'సనాతన ధర్మం, కోట్ల మంది ప్రజల నమ్మకానికి అయోధ్య ఒక పవిత్రమైన చిహ్నం. అలాంటి పవిత్రమైన నమ్మకంతో ఆడుకోవాలని చూసే లేదా దానికి విఘాతం కలిగించే ఎంతటి వారినైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదు' అని హెచ్చరించారు.
అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయానికి భక్తులు సమర్పించిన విరాళాల నిధుల దుర్వినియోగం వ్యవహారంలో ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. ఆలయ విరాళాల లెక్కింపు ప్రక్రియతో సంబంధం ఉన్న ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేశారు.
అయోధ్యలో రామాలయ నిర్మాణం కలను నెరవేర్చుకోవడానికి 500 ఏళ్లు ఎదురుచూశామని.. ఇప్పుడు ఆలయ నిర్మాణానికి వచ్చిన విరాళాలు మాయమయ్యాయన్న...
అయోధ్య రామాలయంలో విరాళాల చోరీ వివాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తొలిసారి స్పందించారు. దోషులు ఎవరైనప్పటికీ విడిచిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. శుక్రవారంనాడు అయోధ్య పర్యటనలో ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.
సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కుమార్తె అదితి యాదవ్పై కొందరు తప్పుడు, అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం, సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్ చేయడంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర అభ్యంతర వ్యక్తం చేశారు. సమాజంలో ఎవరి ఆడపిల్లపైనా ఒకటేనని, వారిని ఇలాంటి నీచమైన ప్రజా చర్చల్లోకి లాగకూడదని అన్నారు.
దేశ సంస్కృతి, సంప్రదాయాల పట్ల విశ్వాసం లేని వారికి భారతదేశం ఎంతమాత్రం ధర్మశాల కాదని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
ఇవాళ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పుట్టినరోజు (జూన్ 5) సందర్భంగా ప్రధాని మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. యోగి సుదీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు. ప్రముఖ నటి హేమమాలినితోపాటు అనేకమంది ప్రముఖులు యోగికి శుభాకాంక్షలు చెప్పారు.
గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలంటూ కొందరు ముస్లిం మౌల్వీలు చేస్తున్న డిమాండ్పై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కౌంటర్ ఇచ్చారు. చెప్పేదొకటి..చేసేదొకటి అనే రితీలో ద్వంద్వ ప్రమాణాలు తగదని హితవు పలికారు.
స్వాతంత్య్ర సమరయోధుడు వినాయక్ దామోదర్ సావర్కర్ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ నివాళులర్పించారు. సావర్కర్ పోరాట జీవితం రాబోయే తరాలకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని పేర్కొన్నారు.
రోడ్లపై నమాజ్ చేసే ముస్లింలకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక హెచ్చరికలు జారీచేశారు. బహిరంగ ప్రదేశాల్లో నమాజ్, జంతు బలి కార్యక్రమాలు చేపట్టవద్దని సూచిస్తూ.. 10 కీలక ఆదేశాలిచ్చారు.