Share News

Karnatka: కారులో కాలిన స్థితిలో మూడు మృతదేహాలు.. కారణం అదేనా..

ABN , Publish Date - Mar 24 , 2024 | 11:54 AM

నిధి ఉందని నమ్మించారు. ఖజానాలో దొరికిన నగలను బంగారం అని వంచించారు. చివరకు ముగ్గురిని దారుణంగా హత్య చేసి కారులోనే నిప్పు పెట్టారు. కర్ణాటక ( Karnataka ) లోని తుమకూరు జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ కారులో కాలిపోయిన స్థితిలో మూడు మృతదేహాలు కనిపించడం తీవ్ర కలకలం రేపింది.

Karnatka: కారులో కాలిన స్థితిలో మూడు మృతదేహాలు.. కారణం అదేనా..

నిధి ఉందని నమ్మించారు. ఖజానాలో దొరికిన నగలను బంగారం అని వంచించారు. చివరకు ముగ్గురిని దారుణంగా హత్య చేసి కారులోనే నిప్పు పెట్టారు. కర్ణాటక ( Karnataka ) లోని తుమకూరు జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ కారులో కాలిపోయిన స్థితిలో మూడు మృతదేహాలు కనిపించడం తీవ్ర కలకలం రేపింది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు, దర్యాప్తు బృందాలు కీలకమైన ఆధారాలు సేకరించారు. చనిపోయిన వారు మంగళూరులోని బెల్తంగడి తాలూకాకు చెందినరిగా గుర్తించారు. త్వరలోనే దీని వెనుక ఉన్న ముఠాను ఛేదిస్తామని తుమకూరు పోలీసు సూపరింటెండెంట్ అశోక్ కేవీ తెలిపారు.

ఆ రెండు పార్టీలు కలిసి అవినీతి చేశాయి.. ఆమె బాధకు కేజ్రీవాలే కారణం.. బీజేపీ

నిధిని విక్రయిస్తామనే సాకుతో నిందితులు ముగ్గురిని మోసగించి, హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితులను వేరే ప్రాంతంలో చంపి ఇక్కడికి తీసుకువచ్చి మృతదేహాలను తగలబెట్టారని భావిస్తున్నారు. నిధిలో దొరికిన బంగారు నగలను విక్రయిస్తామని నమ్మించిన దుండగులు వారిని హత్య చేసి డబ్బు, నగలను దోచుకున్నారు. వాహనంలోనే వారి మృతదేహాలకు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో సుమారు ఆరుగురు వ్యక్తులు పాల్గొన్నట్లు తెలుస్తోంది.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 24 , 2024 | 11:54 AM