Share News

PM Modi: కేరళలో కమలం వికసిస్తుంది.. పాలక్కడ్ రోడ్ షోలో ప్రధాని..

ABN , Publish Date - Mar 19 , 2024 | 12:47 PM

కేరళలోని పాలక్కడ్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ( PM Modi ) బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కేరళలో కమలం వికసిస్తుందని అన్నారు.

PM Modi: కేరళలో కమలం వికసిస్తుంది.. పాలక్కడ్ రోడ్ షోలో ప్రధాని..

కేరళలోని పాలక్కడ్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ( PM Modi ) బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కేరళలో కమలం వికసిస్తుందని అన్నారు. పాలక్కడ్ లో ఉదయం 10:45 గంటలకు ప్రారంభమైన ర్యాలీలో సౌత్ కేరళ నియోజకవర్గాలలో పోటీ చేస్తున్న ఎన్డీఏ అభ్యర్థులకు ప్రధాని మోదీ మద్దతు ఇచ్చారు. రాష్ట్ర ప్రజలు ఇన్నాల్లు కష్టాలను చవిచూశారని ఆరోపించారు. అవినీతి, అసమర్థతలో ప్రభుత్వం మునిగిపోయిందని మండిపడ్డారు. కేరళలో పోటీ పడే ఎల్‌డీఎఫ్, యూడిఎఫ్ లు దిల్లీలో ఒక్కటయ్యాయన్నారు. ఈ రెండు పార్టీలు కేరళను మోసం చేశాయని విమర్శించారు.

ఈ ఏడాది ప్రధాని మోదీ అనేక సార్లు దక్షిణాది రాష్ట్రాలను సందర్శించారు. అందులో భాగంగా కేరళలోని ప్రముఖ దేవాలయాలనూ సందర్శించారు. కర్ణాటకలోని శివమొగ్గ, తమిళనాడులోని కోయంబత్తూరులో ప్రధాని పర్యటించారు. కాంగ్రెస్ నాయకులు పచ్చి అబద్ధాలు మాత్రమే చెప్పగలరని ఆరోపణలు చేశారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో కర్ణాటక ప్రజలు కాంగ్రెస్‌ను ఇంటికి పంపించేస్తారని ప్రధాని అన్నారు.

Gujarat: వారిపై దాడికి నమాజ్ ఒక్కటే కారణం కాదు.. వీసీ సంచలన ప్రకటన..

Maharashtra: పోలీసులు మావోయిస్టుల మధ్య కాల్పులు.. నలుగురు దుర్మరణం..


తమిళనాడులోని కోయంబత్తూరులో 1998లో జరిగిన పేలుళ్ల ఘటనలో మృతుల చిత్రపటాలకు సోమవారం ప్రధాని పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నగరంలో రోడ్‌షో నిర్వహిస్తున్నారు. మెట్టుపాళయం రోడ్డులోని సాయిబాబా ఆలయం దగ్గర ప్రారంభమైన ప్రధాని రోడ్‌షో ఆర్‌ఎస్‌ పురం వద్ద ముగిసింది. ప్రధానిని చూసేందుకు కార్యకర్తలు, పార్టీ నేతలతో పాటు స్థానిక ప్రజలూ భారీగా తరలివచ్చారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 19 , 2024 | 12:48 PM