Share News

Rahul Gandhi: ఫోన్ చూడండి.. జై శ్రీరాం అనండి.. ఆకలితో చావండి.. రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు

ABN , Publish Date - Mar 05 , 2024 | 04:17 PM

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ప్రజలు ఫోన్ చూడాలి.. జై శ్రీరాం అనాలి. అలా చేస్తూ ఆకలితో చావండి. ప్రధాని మోదీకి కావాల్సింది ఇదే అని’ రాహుల్ గాంధీ అన్నారు. మధ్యప్రదేశ్ సారంగపూర్‌లో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ ఈ కామెంట్స్ చేశారు.

Rahul Gandhi: ఫోన్ చూడండి.. జై శ్రీరాం అనండి.. ఆకలితో చావండి.. రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు

సారంగపూర్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ప్రజలు ఫోన్ చూడండి.. జై శ్రీరాం అనండి. అలా ఆకలితో చావండి. ప్రధాని మోదీకి (Modi) కావాల్సింది ఇదే అని’ రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. మధ్యప్రదేశ్ సారంగపూర్‌లో రాహుల్ గాంధీ (Rahul Gandhi) భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశారు. యాత్రలో కొందరు బీజేపీ కార్యకర్తలు మోదీ, మోదీ, జై శ్రీరాం అని నినదించారు. మరికొందరు బీజేపీ కార్యకర్తలు ఆలుగడ్డలు ఇస్తామని తమకు బంగారం ఇవ్వాలని కోరారు. ఆ సమయంలో దేశంలో నిరుద్యోగిత గురించి రాహుల్ గాంధీ ఆవేశంగా మాట్లాడారు. దేశంలో ఉద్యోగం లేని యువత సోషల్ మీడియాను చూస్తున్నారు. రోజంతా రీల్స్ చూడటంలో బిజీగా ఉంటున్నారు. వారు అలా ఉండటం ప్రధాని మోదీకి ఇష్టం కావొచ్చుని అభిప్రాయ పడ్డారు. ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ కామెంట్లపై బీజేపీ స్పందించింది. మోదీపై ఇలా అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని సూచించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 05 , 2024 | 04:17 PM