Share News

Pawan Kalyan: 17న బెంగళూరుకు పవన్‌ కల్యాణ్‌.. బీజేపీ నేతలకు మద్దతుగా ప్రచారం

ABN , Publish Date - Apr 12 , 2024 | 10:48 AM

రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి ప్రముఖ తెలుగు నటుడు, జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan) హాజరు కానున్నారు. లోక్‌సభ ఎన్నికలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర ఒక పరీక్షగా మారాయి.

Pawan Kalyan: 17న బెంగళూరుకు పవన్‌ కల్యాణ్‌.. బీజేపీ నేతలకు మద్దతుగా ప్రచారం
Pawan Kalyan

- తెలుగు ఓటర్లను ఆకట్టుకునేందుకు కమలం నేతల యత్నం

బెంగళూరు: రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి ప్రముఖ తెలుగు నటుడు, జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan) హాజరు కానున్నారు. లోక్‌సభ ఎన్నికలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర ఒక పరీక్షగా మారాయి. విస్తృత ప్రచారం, ఆకట్టుకునే విధానాలతో ఎక్కువసీట్లు సాధించాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇందులో భాగంగా తెలుగు మాట్లాడేవారు ఎక్కువగా ఉండే చిక్కబళ్ళాపుర, కోలారు, బళ్ళారి, రాయచూరు(Chikkaballapura, Kolaru, Bellary, Raichur) ప్రాంతాల్లో పవన్‌కల్యాణ్‌ రోడ్‌షో నిర్వహించాలని నిర్ణయించారు. ఏపీకి సరిహద్దున ఉండే జిల్లాల్లో పవన్‌ కల్యాణ్‌ ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. అందుకు అనుగుణంగానే ప్రచారానికి కార్యాచరణ చేస్తున్నారు. ఈనెల 17న రాయచూరుకు పవన్‌ రానున్నారు. ఉదయం 11 గంటలకు రాయచూరులో బెంజ్‌ సర్కిల్‌ నుంచి రోడ్‌షో ప్రారంభం కానుంది. బీజేపీ అభ్యర్థి రాజా అమరేశ్వరనాయక తరపున ప్రచారం చేయనున్నారు. అదే రోజున మధ్యాహ్నం బళ్ళారిలో రాయల్‌ సర్కిల్‌ నుంచి వివిధ ప్రాంతాల్లో పర్యటించనున్నారు. చిక్కబళ్ళాపుర, కోలారుతోపాటు మరిన్ని ప్రాంతాల్లో పవన్‌ కల్యాణ్‌ సభకు సంబంధించి కార్యక్రమాలు రెండు రోజుల్లోనే ఖరారు కానున్నాయని తెలుస్తోంది.

ఇదికూడా చదవండి: Kavitha: కవితను అరెస్ట్‌ చేసిన సీబీఐ

Updated Date - Apr 12 , 2024 | 12:00 PM