Share News

Prashant Kishor: బీజేపీలోకి నితీష్.. ప్రశాంత్ కిషోర్ ఘాటు వ్యాఖ్యలు

ABN , Publish Date - Jan 28 , 2024 | 05:38 PM

2024 లోక్‌సభ ఎన్నికలకు మించి బీజేపీ, జేడీయూ పొత్తు ఉండదని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు. 2025లో అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే నితీష్ యూ టర్న్ తీసుకునే అవకాశం ఉందని జోస్యం చెప్పారు.

Prashant Kishor: బీజేపీలోకి నితీష్.. ప్రశాంత్ కిషోర్ ఘాటు వ్యాఖ్యలు

బిహార్ సీఎం పదవికి నితీష్ కుమార్(Nitish kumar) రాజీనామా చేసి, మహాఘటబంధన్ కూటమిని వదులుకున్న కొన్ని గంటల తర్వాత రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్(Prashant Kishor) తనదైన శైలిలో స్పందించారు. బిహార్ ప్రజలను ఫూల్స్ చేస్తు నితీష్ తెలివితక్కువ పనిచేశారని ప్రశాంత్ కిషోర్ అన్నారు. అంతేకాదు ప్రస్తుతం బీజేపీలో చేరిన నితీష్ 2025లో జరిగే అసెంబ్లీ ఎన్నికల వరకు ఈ పొత్తు ఉండదని జోస్యం చెప్పారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత బీజేపీ రాష్ట్రంలో 20 సీట్లకు మించి గెలిచే అవకాశం లేదన్నారు.


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Bihar Politics: 9వ సారి బిహార్ సీఎంగా నితీశ్ కుమార్ ప్రమాణం

అంతేకాదు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ 20కి పైగా సీట్లు గెలిస్తే తన పని నుంచి రిటైర్మెంట్ తీసుకుంటానని రాసిపెట్టుకోవాలని ప్రశాంత్ కిషోర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బిహార్ ప్రజలు నితీష్‌కు వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తారని అన్నారు ప్రశాంత్ కిషోర్. ఇలాంటి క్రమంలో నితీష్ మరో యూ టర్న్ తీసుకోక తప్పదని ప్రశాంత్ కిషోర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. బీహార్‌లో 40 లోక్‌సభ స్థానాలు ఉండగా 2019 ఎన్నికల్లో బీజేపీ, జేడీయూ కలిసి 39 సీట్లు గెలుచుకున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీహార్‌లో సీట్లు కోల్పోవడం బీజేపీకి ఇష్టం లేదని, అందుకే నితీష్‌కుమార్‌ను తిరిగి ఎన్డీఏలోకి స్వాగతించిందని భావిస్తున్నారు.

బీజేపీ ప్రభావం

బీహార్‌లో బీజేపీ ప్రభావం పెరుగుతోందని, అసెంబ్లీ ఎన్నికలలో పెద్ద పాత్ర పోషిస్తుందని ప్రశాంత్ కిషోర్ విశ్వసిస్తున్నారు. ఆర్జేడీతో కలిసి వెళితే 2024లో తనకు వచ్చినన్ని లోక్‌సభ సీట్లు రావని నితీశ్ భయపడుతున్నట్లు కూడా చెప్పారు. చాలా మంది జేడీయూ ఎంపీలు ఆర్జేడీతో తెగతెంపులు చేసుకోవాలను కుంటున్నారని మళ్లీ ఎన్డీయేలోకి రావాలని నితీశ్‌పై ఒత్తిడి తెచ్చిన క్రమంలోనే ఇలా చేసి ఉండొచ్చని అన్నారు.

నితీష్‌పై కాంగ్రెస్‌

నితీష్ చర్యను 'ద్రోహం'గా అభివర్ణించిన కాంగ్రెస్, బీహార్ ప్రజలు ఆయనకు గుణపాఠం చెబుతారని తెలిపింది. నితీష్‌ కుమార్‌ రాజీనామా చేసినా ఆశ్చర్యం లేదని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి, కమ్యూనికేషన్‌ ఇన్‌ఛార్జ్‌ జైరాం రమేష్‌ అన్నారు. ఆయన అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడు. గత కొన్నేళ్లుగా నిరంతరం ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. అయితే ఆయన తన రాజకీయ రంగును మారుస్తూనే ఉన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రపై బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా కలత చెందుతున్నారని జైరాం రమేష్ అన్నారు. ప్రయాణం నుంచి దృష్టి మరల్చడానికి ఈ డ్రామా జరిగిందన్నారు. ద్రోహం చేయడంలో నితీష్ కుమార్ నిపుణుడని విమర్శించారు.

Updated Date - Jan 28 , 2024 | 05:39 PM