Home » RJD
పార్టీ వ్యవస్థాపకుడు లాలూ ప్రసాద్ ఆదేశాలతోనే తాను పార్టీ కార్యకలాపాలు చూసుకున్నానని, ఎన్నికల్లో గట్టిగా ప్రయత్నం చేసినప్పటకీ ఓటమి పాలయ్యామని తేజస్వి అన్నారు. ఇందుకు తాను బాధ్యత తీసుకుంటున్నట్టు చెప్పారు.
ఆర్జేడీ ఎమ్మెల్యేలు జరిపిన సమావేశంలో ఎన్నికల్లో 'మహాగఠ్బంధన్' ఓటమికి కారణాలను విశ్లేషించినట్టు తెలుస్తోంది. ఆర్జేడీ దయనీయ పరిస్థితికి లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య కారణమంటూ ఆరోపించిన సంజయ్ యాదవ్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
బిహార్ నుంచి వచ్చే ఏడాది రాజ్యసభకు జరిగే ఎన్నికల్లో ఒక అభ్యర్థి గెలవాలంటే కనీసం 42 సీట్లు ఉండాలి. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో మహాగఠ్బంధన్ కేవలం 35 సీట్లు సాధించింది.
తేజ్ ప్రతాప్ తన సోదరి రోహిణి వీడియోను ఇన్స్టాగ్రామ్లో జేజేడీ అధికార ఖాతా నుంచి షేర్ చేశారు. తనకు అన్యాయం జరిగితే భరించానని, అయితే తన చెల్లెల్ని అవమానిస్తే మాత్రం మౌనంగా చూస్తూ ఉండేది లేదని హెచ్చరించారు.
తేజస్వి యాదవ్కు కీలక సన్నిహితుడైన రమీజ్ నేమత్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని భంగ్కలా గ్రామానికి చెందినవాడు. రాజకీయ సంబంధాలున్న కుటుంబం నుంచి వచ్చాడు.
243 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఆర్జేడీ కేవలం 25 సీట్లకే పరిమితమైంది. 2010 తర్వాత దారుణమైన ఫలితాలు వచ్చిన రెండో సందర్భం ఇది. అప్పటి ఎన్నికల్లో ఆర్జేడీ కేవలం 22 సీట్లు గెలుచుకుంది.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి పరాజయం పాలైన మరుసటి రోజే రోహిణి ఆచార్య ఈ ప్రకటన చేయడం సంచలనమైంది. ఆర్జేడీ కుటుంబంలో అంతర్గత కలహాలే ఇందుకు దారితీసుండవచ్చనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.
సీట్ల షేరింగ్ ఫార్ములాలో భాగంగా 143 సీట్లలో ఆర్జేడీ పోటీ చేసి కేవలం 25 సీట్లలో గెలిచింది. 23 శాతం ఓట్ షేర్ రాబట్టింది. గత ఎన్నికల్లో ఇది 23.11గా ఉంది. గత ఎన్నికల్లోనూ 144 అసెంబ్లీ స్థానాల్లో ఆర్జేడీ పోటీ చేసింది.
గెలుపు పక్కా అంటూ ఆత్మవిశ్వాసంతో ఉన్న ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్కు రాఘోపూర్లో బీజేపీ నేత సతీశ్ కుమార్ యాదవ్ నుంచి గట్టిపోటీ ఎదురైంది. మొదట్లో సతీశ్ ఆధిక్యంలోకి రావడం ఆర్జేడీ వర్గాలను కాస్త టెన్షన్ పెట్టింది. అయితే, చివరకు తేజస్వీ 14 వేల పైచిలుకు మెజారిటీతో గెలుపును సొంతం చేసుకున్నారు.
ఈసారి ఆర్జేడీ, కాంగ్రెస్ గెలిచే సీట్లు తగ్గవచ్చని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. ఆ ప్రకారం చూసినప్పుడు గత ఎన్నికల్లో మహాగఠ్బంధన్లోని ఆర్జేడీ, కాంగ్రెస్ సాధించిన సీట్లు ఈసారి తగ్గే అవకాశం ఉంది.