Home » JDU
దేశంలో సార్వత్రిక ఎన్నికల వేళ విచిత్ర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. గెలుపే లక్ష్యంగా ఎవరికి వారు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఏడు విడతల్లో భాగంగా మొదటి విడత పోలింగ్ ముగిసింది. రెండో విడత పోలింగ్ ఈనెల 26వ తేదీన జరగనుంది. బీహార్లోని పూర్నియా లోక్సభ స్థానానికి రెండో విడతలో పోలింగ్ జరగనుంది. ఈ నియోజకవర్గం దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. బీహార్లోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఇండియా కూటమి, ఎన్డీయే కూటమి అభ్యర్థుల మధ్య ద్విముఖ పోరు నెలకొంది. ఒక పూర్నియా స్థానంలో మాత్రం ఇండిపెండెంట్ అభ్యర్థిగా మాజీ ఎంపీ పప్పు యాదవ్ పోటీ చేస్తుండటంతో త్రిముఖ పోటీ నెలకొంది.
రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం (Election Comission) షాక్ ఇచ్చింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసే హోర్డింగ్స్ విషయంలో తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని సూచించింది.
బీహార్లో జాతీయ ప్రజాస్వామ్య కూటమి పార్టీల మధ్య లోక్సభ సీట్ల పంపకాలు ఖరారయ్యాయి. 17 సీట్లలో బీజేపీ పోటీ చేయనుండగా, నితీష్కుమార్ సారథ్యంలోని జనతాదళ్ యూనైటెడ్ 16 సీట్లలో పోటీ చేయనుంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే ఈ విషయాన్ని సోమవారంనాడు ప్రకటించారు.
లోక్సభ ఎన్నికల్లో భాగంగా బీహార్ లో ఎన్డీయే భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు దాదాపు కొలిక్కి వచ్చింది. నితీష్ కుమార్ సారథ్యంలోని జేడీయూకు 14 సీట్లను బీజేపీ ఆఫర్ చేయగా, చిరాగ్ పాశ్వాన్, పశుపతి పరస్కు-6 సీట్లు బీజేపీ ఆఫర్ చేసింది. ఉపేంద్ర కుష్వాహ, మాంఠీ (హెచ్ఏఎం)కు చెరో సీటు ఇవ్వనుంది. బీజేపీ 17 సీట్లలో పోటీ చేసే అవకాశం ఉంది.
ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం తాజాగా తీసుకువచ్చిన ఒకే దేశం - ఒకే ఎన్నికలు విధానానికి వివిధ పార్టీల నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కొన్ని పార్టీలు వ్యతిరేకిస్తుండగా మరికొన్ని స్వాగతిసున్నాయి.
బీహర్లో నితీష్ కుమార్ కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. అసెంబ్లీలో సోమవారం నాడు నితీశ్ కుమార్ బలం నిరూపించుకోవాల్సి ఉంది.
బిహార్ సీఎం నితీశ్ కుమార్ త్వరలో అసెంబ్లీలో బల పరీక్షకు వెళ్తున్న వేళ.. ఆర్జేడీ(RJD)కి చెందిన పలువురు ఎమ్మెల్యేలు కనిపించకకుండా పోవడం రాష్ట్ర రాజకీయాలను హీటెక్కిస్తోంది. నితీశ్(Nitish Kumar) మహాఘట్బంధన్ను వీడి బీజేపీ(BJP)లో చేరిన అనంతరం మాజీ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ "ఆట ముగియలేదు" అని కామెంట్స్ చేశారు.
2024 లోక్సభ ఎన్నికలకు మించి బీజేపీ, జేడీయూ పొత్తు ఉండదని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు. 2025లో అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే నితీష్ యూ టర్న్ తీసుకునే అవకాశం ఉందని జోస్యం చెప్పారు.
Tejashwi Yadav First Reaction On Nitish: నితీష్ కుమార్ యాదవ్ మహాఘట్బంధన్ నుంచి వైదొలిగిన తరువాత తొలిసారి స్పందించారు ఆర్జేడీ నేత, బీహార్ మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్. జేడీ(యూ)(JDU)-బీజేపీ(BJP) కలిసి అధికారం చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారు.. కానీ, బీహార్లో ఆట ఇంకా ముగియలేదు, అసలు గేమ్ ముందుంది అని ఫస్ట్ కామెంట్ చేశారు తేజస్వి యాదవ్.
బీహార్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. జేడీయూ అధినేత నితీశ్ కుమార్ సీఎం పదవికి రాజీనామా చేశారు.