Home » Prashant Kishor
బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఖాళీ చేసిన బంకీపూర్ నియోజకవర్గం ఉప ఎన్నికలో జన్ సురాజ్ పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు. బంకీపూర్లో బీజేపీని ఓడిచే సామర్థ్యం జన్ సురాజ్కే ఉందని ధీమా వ్యక్తం చేశారు.
తమిళనాడులో విజయ్ టీవీకే 98 నుంచి 120 సీట్లు గెలుస్తుందని గత ఏడాది మార్చిలో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ముందే జోస్యం చెప్పారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్ తాజాగా సునామీ సృష్టిస్తున్నారు.
జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ మరోసారి యాత్ర బాట పట్టారు. పశ్చిమ చంపరాణ్ జిల్లా నుంచి 'బిహార్ నవనిర్మాణ్ యాత్ర'ను ఆదివారంనాడు ప్రారంభించారు.
బాధ్యత కలిగిన భారతీయుడుగా తాను జన్ సురాజ్ పార్టీలో చేరానని, పూర్తి నిజాయితీతో ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొన్నానని, పార్టీకి ప్రతికూల ఫలితాలు వచ్చినప్పటికీ చింతించడం లేదని పాండే తెలిపారు.
స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక ప్రభుత్వం ప్రజల కోసం రూ.40,000 కోట్లు ఖర్చుచేస్తామని ప్రకటించడం ఇదే మొదటిసారని, ఆ కారణంగానే ఎన్డీయే ఘనవిజయం సాధించిందని ప్రశాంత్ కిషోర్ అన్నారు.
జన్సురాజ్ నిర్మాణానికి తాము ఎంతో కష్టపడ్డామని, మార్పు ఇప్పటికే కనిపిస్తోందని, ఫలితాల కోసం వేచిచూద్దామని ప్రశాంత్ కిషోర్ అన్నారు. బిహార్ ప్రజలు ఇప్పటికీ మార్పును కోరుకోకుంటే వారితోనే ఉంటూ మరో ఐదేళ్లు పని చేస్తూ వెళ్తానని చెప్పుకొచ్చారు. అంతేకానీ, ప్రభుత్వంలో చేరే ప్రసక్తే లేదన్నారు.
ఓటింగ్ శాతం పెరిగినప్పుడు ప్రభుత్వ వ్యతిరేకతే ఇందుకు కారణమనే అభిప్రాయం సహజంగా వినిపిస్తుంటుంది. అయితే అది అన్నివేళలా నిజం కాదని గత రెండేళ్లలో జరిగిన ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ఎన్నికల ఫలితాలే నిదర్శనం.
ప్రజాప్రాతినిధ్య చట్టం-1950 లోని సెక్షన్ 17 కింద ఒక వ్యక్తి ఒకటికి మించిన నియోజకవర్గాల్లో పేరు నమోదు చేసుకోరాదు. అలా చేసినట్లయితే సెక్షన్ 31 కింద ఏడాది జైలు, జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది.
సీతామర్హిలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ, ఇది జన్ సురాజ్ జన్మభూమి అని, మూడేన్నరేళ్ల క్రితం పార్టీ పుట్టిందని చెప్పారు. భయంతో బీజేపీకో, లాలూకో ఓటు వేయాల్సిన పనిలేదని, బిహార్లో రాజకీయ వెట్టిచాకిరీకి తాము ముగింపు పలకాలని తమ పార్టీ గట్టిగా తీర్మానించుకుందని తెలిపారు.
నామినేషన్లు వేసిన వారిని బెదిరించి వాటిని ఉపసంహరించుకోవడం ద్వారా పోటీ లేకుండా గెలవాలనే సూరత్ మోడల్ను బీజేపీ అమలు చేయాలనుకుంటోందని ప్రశాంత్ కిషోర్ ఆరోపించారు