Share News

AAP: ఏడాదిలో మోదీ సర్కార్ కూలిపోతుంది.. సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Jun 10 , 2024 | 02:24 PM

కేంద్రంలో మోదీ(PM Modi) ప్రభుత్వం మూడోసారి కొలువుదీరిన తరుణంలో ప్రతిపక్షాలు ఆయన సర్కార్‌పై విరుచుకుపడుతున్నాయి. మిత్రపక్షాల సాయంతో కొలువుదీరిన సంకీర్ణ సర్కార్.. ఏడాదిలో కూలిపోతుందని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

AAP: ఏడాదిలో మోదీ సర్కార్ కూలిపోతుంది.. సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ: కేంద్రంలో మోదీ(PM Modi) ప్రభుత్వం మూడోసారి కొలువుదీరిన తరుణంలో ప్రతిపక్షాలు ఆయన సర్కార్‌పై విరుచుకుపడుతున్నాయి. మిత్రపక్షాల సాయంతో కొలువుదీరిన సంకీర్ణ సర్కార్.. ఏడాదిలో కూలిపోతుందని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఎన్డీయే మిత్రపక్షాలు ప్రభుత్వాన్ని సజావుగా నడపలేవని విమర్శించారు.


మిత్ర పక్షాలను విచ్ఛిన్నం చేసే దిశగా మోదీ నడుస్తున్నారని ఆరోపించారు. టీడీపీ, జేడీయూలను విచ్ఛిన్నం చేసి బీజేపీ ఎంపీలను లాగేసుకుంటుందని అన్నారు. అలా అస్థిర ప్రభుత్వం ఏర్పడి మొత్తంగా ఏడాదిలో మోదీ సర్కార్ కూలిపోతుందని అన్నారు.

Read Latest News and National News here..

Updated Date - Jun 10 , 2024 | 02:24 PM