Share News

Jharkhand: టెంట్‌లో దూరి.. సామూహిక అత్యాచారానికి పాల్పడి.. స్పానిష్ మహిళపై దారుణం..

ABN , Publish Date - Mar 02 , 2024 | 12:30 PM

జార్ఖండ్‌లో దారుణం జరిగింది. పర్యటన కోసం స్పెయిన్ నుంచి వచ్చిన ఓ మహిళపై సామూహిక అత్యాచారం ( Crime News ) జరిగింది. మార్చి 2 శనివారం తెల్లవారుజామున రాష్ట్రంలోని దుమ్కా జిల్లాలో ఈ ఘటన వెలుగుచూసింది.

Jharkhand: టెంట్‌లో దూరి.. సామూహిక అత్యాచారానికి పాల్పడి.. స్పానిష్ మహిళపై దారుణం..

జార్ఖండ్‌లో దారుణం జరిగింది. పర్యటన కోసం స్పెయిన్ నుంచి వచ్చిన ఓ మహిళపై సామూహిక అత్యాచారం ( Crime News ) జరిగింది. మార్చి 2 శనివారం తెల్లవారుజామున రాష్ట్రంలోని దుమ్కా జిల్లాలో ఈ ఘటన వెలుగుచూసింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.హన్స్‌దిహా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన జరిగింది. బాధితురాలు తన భర్తతో కలిసి దుమ్కా మీదుగా భాగల్పూర్ కు బైక్ టూర్ కు వెళ్లింది. రాత్రి 12 గంటల సమయంలో హన్స్‌దిహా మార్కెట్‌ ముందు జన సంచారం లేని ప్రదేశంలో టెంట్ వేసుకుని నిద్రకు ఉపక్రమించింది.

అదే సమయంలో సమీపంలోని కొందరు యువకులు టెంట్‌లోకి చొరబడ్డారు. నిద్రపోతున్న మహిళపై సామూహిక అత్యాచారం చేశారు. అంతే కాకుండా తీవ్రంగా కొట్టి గాయపడ్డారు. జనసంచారం లేకపోవడంతో ఆమెకు సహాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఘోరం జరిగిన తర్వాత బాధితురాలు నేరుగా పోలీస్ స్టేషన్ కు చేరుకుంది. తమపై జరిగిన దారుణం వివరిస్తూ న్యాయం చేయాలంటూ పోలీసులను వేడుకుంది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.


అయితే ఈ కేసుకు సంబంధించిన వివరాలు తెలిపేందుకు దుమ్కా ఎస్పీ పీతాంబర్ సింగ్ ఖేర్వార్ నిరాకరించారు. ప్రస్తుతం ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని వెల్లడించారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 02 , 2024 | 12:30 PM