Share News

YCP-TDP: వైసీపీ నుంచి టీడీపీలోకి నేడు పెద్ద ఎత్తున చేరికలు..

ABN , Publish Date - Apr 05 , 2024 | 01:57 PM

వైసీపీ నుంచి పెద్ద ఎత్తున నేతలు నేడు టీడీపీలో చేరారు. వైసీపీ నుంచి భారీ చేరికలతో ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం వద్ద సందడి వాతావరణం నెలకొంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో అనంతపురం, గుంటూరు జిల్లాలకు చెందిన కీలక నేతలు చేరనున్నారు.

YCP-TDP: వైసీపీ నుంచి టీడీపీలోకి నేడు పెద్ద ఎత్తున చేరికలు..

అమరావతి: వైసీపీ నుంచి పెద్ద ఎత్తున నేతలు నేడు టీడీపీ (TDP)లో చేరారు. వైసీపీ నుంచి భారీ చేరికలతో ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం వద్ద సందడి వాతావరణం నెలకొంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో అనంతపురం, గుంటూరు జిల్లాలకు చెందిన కీలక నేతలు చేరనున్నారు. మరోవైపు గుంటూరు పార్లమెంటు అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఆధ్వర్యంలో గుంటూరుకు చెందిన తాడిశెట్టి వెంకట్రావు దంపతులు టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. వందలాది కార్లతో ర్యాలీగా తాడిశెట్టి వెంకట్రావు లోకేష్ ఇంటికి చేరుకున్నారు. అలాగే అనంతపురానికి చెందిన కీలక వైసీపీ నేత జయరామ్ నాయుడు దంపతులతో పాటు ఐదుగురు కార్పొరేటర్లు టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు.

AP Politics: చంద్రబాబు సమక్షంలో టీడీపీలోకి రఘురామకృష్ణం రాజు..!

మరిన్ని ఏపీ వార్తల కోసం...

Updated Date - Apr 05 , 2024 | 01:57 PM