Share News

AP Politics: చంద్రబాబు సమక్షంలో టీడీపీలోకి రఘురామకృష్ణం రాజు..!

ABN , Publish Date - Apr 05 , 2024 | 01:24 PM

Andhra Pradesh: ఎంపీ రఘురామకృష్ణం రాజు(Raghu Rama Krishna Raju) మరికాసేపట్లో టీడీపీలో(TDP) చేరనున్నారు. నల్లజర్లలో చంద్రబాబును(Chandrababu) కలిసి.. పార్టీలో చేరనున్నారు. ఈ నేపథ్యంలోనే రఘురామకృష్ణం రాజు భీమవరం(Bhimavaram) నుంచి నల్లజర్ల బయలుదేరారు.

AP Politics: చంద్రబాబు సమక్షంలో టీడీపీలోకి రఘురామకృష్ణం రాజు..!

Andhra Pradesh: ఎంపీ రఘురామకృష్ణం రాజు(Raghu Rama Krishna Raju) మరికాసేపట్లో టీడీపీలో(TDP) చేరనున్నారు. నల్లజర్లలో చంద్రబాబును(Chandrababu) కలిసి.. పార్టీలో చేరనున్నారు. ఈ నేపథ్యంలోనే రఘురామకృష్ణం రాజు భీమవరం(Bhimavaram) నుంచి నల్లజర్ల బయలుదేరారు. ప్రస్తుతం చంద్రబాబు నల్లజర్లలో ఉన్నారు. ఆయన్ను కలిసి.. పార్టీలో చేరనున్నారు. ఈ భేటీలో రఘురామకృష్ణంరాజు పోటీపై స్పష్టత వచ్చే అవకాశం కూడా ఉంది.


టీడీపీలో చేరనున్న ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి..

ఇదిలాఉంటే.. వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణ మూర్తి టీడీపీలో చేరనున్నారు. చంద్రబాబు పర్యటన సందర్భంగా ఆయన తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. శనివారం నాడు పల్నాడు జిల్లాలో చంద్రబాబు పర్యటించనున్నారు. పెదకూరపాడు, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో ప్రజాగళం సభల్లో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో క్రోసూరులో సభ ఏర్పాట్లను టీడీపీ అభ్యర్థి భాష్య ప్రవీణ్ పరిశీలించారు. సత్తెనపల్లిలో సభా ఏర్పాట్లను టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ పరిశీలించారు. సత్తెనపల్లి సభలోనే ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి టీడీపీలో చేరనున్నారు.


ఇవికూడా చదవండి:

బుగ్గన వర్గానికి మహిళల నుంచి ఊహించని పరిణామం..

మే 13న జరిగే ఎన్నికలతో ఆ మార్పు వస్తుంది

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Apr 05 , 2024 | 01:24 PM