Share News

Andhra Pradesh: కొట్టుకున్న వైసీపీ నాయకులు..

ABN , Publish Date - Apr 03 , 2024 | 07:30 PM

వైసీపీ(YCP)లో వర్గ విబేధాలు బయటపడుతున్నాయి. సొంత పార్టీలో నాయకులే కొట్టు కుంటున్నారు. ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీలో అసంతృప్త నేతలు తమ గళం విప్పుతున్నారు. తాజాగా ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం వైసీపీలో లుకలుకలు బయటపడ్డాయి.

Andhra Pradesh: కొట్టుకున్న వైసీపీ నాయకులు..

వైసీపీ(YCP)లో వర్గ విబేధాలు బయటపడుతున్నాయి. సొంత పార్టీలో నాయకులే కొట్టుకుంటున్నారు. ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీలో అసంతృప్త నేతలు తమ గళం విప్పుతున్నారు. తాజాగా ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో వైసీపీలో లుకలుకలు బయటపడ్డాయి. ఎన్నికల వేళ జంగారెడ్డి గూడెంలో నిర్వహించిన వైసీపీ సమావేశంలో నాయకులు బాహాబాహికి దిగారు. ఈరోజు వైసీపీ బూత్ కమిటీ సభ్యుల సమావేశం నిర్వహించగా.. జంగారెడ్డి గూడెంలోని స్థానిక నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

Varla Ramaiah: సచివాలయానికి వచ్చి పెన్షన్ తీసుకోమనడం దుర్మార్గం: వర్ల రామయ్య


కోవర్టులు ఎవరు..?

పార్టీలో కొందరు తెలుగుదేశం పార్టీకి కోవర్టులుగా పని చేస్తున్నారని మరికొందరు నేతలు ఆరోపించారు ఈ క్రమంలో గోకుల పారిజాత గిరి ఆలయం చైర్మన్ గూడపాటి రాధాకృష్ణ , చింతలపూడి ఏ ఎం సీ వైస్ చైర్మన్ రవికుమార్ మధ్య ఘర్షణ మొదలైంది. ఒకరిని ఒకరు అసభ్య పదజాలంతో దూషించుకోవడంతో వాగ్వాదం పెరిగి పెద్దదైంది.


కొట్టుకున్న నాయకులు

రవి కుమార్ టీడీపీకి కోవర్టుగా పని చేస్తున్నారని రాధాక‌ృష్ణ ఆరోపించారు. పార్టీలోనూ విబేధాలు సృష్టిస్తున్నారన్నారు. దీంతో రవి కుమార్ కూడా రాధాకృష్ణపై ఆరోపణలు చేశారు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరగడంతో రాధాకృష్ణ రవికుమార్‌పై చేయిచేసుకున్నారు. ఈ ఉదంతం చూసిన అక్కడి నాయకులు విస్తుపోయారు. చివరికి పార్టీలో సీనియర్లు జోక్యం చేసుకుని ఇద్దరి నాయకులకు సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు.


AP Pension: మరీ ఇంతలానా!.. టీడీపీని బద్నాం చేసేందుకు వృద్ధులను వాడేసుకున్న వైసీపీ

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 03 , 2024 | 07:30 PM