Share News

CM Revanth: సీఎంగా తొలిసారి ఏపీకి రేవంత్... కామెంట్లపై సర్వత్రా ఆసక్తి

ABN , Publish Date - Mar 16 , 2024 | 09:57 AM

Andhrapradesh: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు (శనివారం) ఏపీలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రిగా తొలిసారి రేవంత్ ఆంధ్రాలో పర్యటించనున్నారు. విశాఖలో జరగనున్న బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. తొలిసారి ఏపీ వేదికగా రేవంత్‌రెడ్డి ఎలాంటి కామెంట్లు చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ పార్టీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న బహిరంగ సభకు రేవంత్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

CM Revanth: సీఎంగా తొలిసారి ఏపీకి రేవంత్... కామెంట్లపై సర్వత్రా ఆసక్తి

విశాఖపట్నం, మార్చి 16: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Telangana CM Revanth Reddy) ఈరోజు (శనివారం) ఏపీలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రిగా తొలిసారి రేవంత్ ఆంధ్రాలో పర్యటించనున్నారు. విశాఖలో జరగనున్న బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. తొలిసారి ఏపీ వేదికగా రేవంత్‌రెడ్డి ఎలాంటి కామెంట్లు చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ పార్టీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న బహిరంగ సభకు రేవంత్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. సాయంత్రం స్టీల్‌ప్లాంట్ గ్రౌండ్స్‌లో ఈ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభావేదికగా సేవ్ వైజాగ్ – సేవ్ స్టీల్ ప్లాంట్ డిక్లరేషన్‌ను కాంగ్రెస్ విడుదల చేయనుంది.

ఇవి కూడా చదవండి...

AP News: బంగారం కోసం నానమ్మను చంపేసి ఇంట్లోనే పూడ్చిపెట్టిన మనవడు..

Kavitha: కవితను రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరు పర్చనున్న అధికారులు


మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 16 , 2024 | 10:18 AM