Share News

AP News: బంగారం కోసం నానమ్మను చంపేసి ఇంట్లోనే పూడ్చిపెట్టిన మనవడు..

ABN , Publish Date - Mar 16 , 2024 | 09:33 AM

కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం పెద్దమరవీడులో దారుణం చోటు చేసుకుంది. బంగారం కోసం సొంత నాన్నమ్మ నాగమ్మ (85) ను మనువడు వెంకటేష్ హత్య చేశాడు. ఇంట్లోనే నాన్నమ్మ మృతదేహాన్ని వెంకటేష్ పూడ్చిపెట్టాడు.

AP News: బంగారం కోసం నానమ్మను చంపేసి ఇంట్లోనే పూడ్చిపెట్టిన మనవడు..

కర్నూలు: కర్నూలు (Kurnool) జిల్లా గోనెగండ్ల మండలం పెద్దమరవీడులో దారుణం చోటు చేసుకుంది. బంగారం (Gold) కోసం సొంత నాన్నమ్మ నాగమ్మ (85) ను మనువడు వెంకటేష్ హత్య చేశాడు. ఇంట్లోనే నాన్నమ్మ మృతదేహాన్ని వెంకటేష్ పూడ్చిపెట్టాడు. 5 వ తేదీ నుంచి తన తల్లి కనిపించడం లేదని నాగమ్మ కుమారుడు బజారి 13 వ తేదీన గోనెగండ్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. మనవడే నాగమ్మను నహత్య చేసినట్టుగా గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Prajagalam: రేపే బోపూడిలో కూటమి ప్రజాగళం బహిరంగ సభ

మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 16 , 2024 | 09:33 AM