Share News

KA Paul: జైశ్రీరాం అనకపోతే చంపేస్తామంటున్నారు

ABN , Publish Date - Feb 26 , 2024 | 12:23 PM

Andhrapradesh: ప్రధాని మోదీ తిరుపతి సాక్షిగా స్పెషల్ స్టేటస్ ఇస్తామన్నారని.. కానీ ఆ మాట మర్చిపోయారని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో మతతత్వం పెంచుతున్నారని.. జై శ్రీరామ్ అనకపోతే చంపేస్తాం అంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

KA Paul: జైశ్రీరాం అనకపోతే చంపేస్తామంటున్నారు

విశాఖపట్నం, ఫిబ్రవరి 26: ప్రధాని మోదీ (PM Modi) తిరుపతి సాక్షిగా స్పెషల్ స్టేటస్ ఇస్తామన్నారని.. కానీ ఆ మాట మర్చిపోయారని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (Prajashanti Party Chief KA Paul) అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో మతతత్వం పెంచుతున్నారని.. జై శ్రీరాం అనకపోతే చంపేస్తాం అని అంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ పాలనలో ఇతర మతాల ప్రజలకు భద్రత లేదన్నారు. పాస్టర్‌లకు ఆత్మ రక్షణ కోసం రైఫిల్ కొనేసి ఇస్తానని తెలిపారు. కేసీఆర్ (BRS Chief KCR) చిత్తుగా ఓడిపోతారని చెప్పానని... అదే జరిగిందన్నారు. మోదీ తొత్తులు అయిన టీడీపీ, జనసేన పార్టీలను (TDP - Janasena) నమ్మవద్దన్నారు. ప్రజాశాంతి పార్టీలో చేరితే పవన్‌ను (Janasena Chief Pawan Kalyan) సీఎంను చేస్తానని అన్నారు. పవన్‌కు ఓపెన్ ఆఫర్ ఇస్తున్నా.. ఎంత డబ్బు కావాలో చెప్పాలన్నారు. కాపులు జనసేన, టీడీపీ పొత్తును వ్యతిరేకిస్తున్నారని కేఏ పాల్ వ్యాఖ్యలు చేశారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 26 , 2024 | 12:23 PM