Home » KA Paul
కొండా సురేఖ వ్యాఖ్యలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ వేదికగా ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కొండా సురేఖపై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొండా సురేఖపై డిఫార్మేషన్ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. కొండా సురేఖ రాజీనామా చేయాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు.
Andhrapradesh: కోట్లాది మంది భక్తులు వచ్చే తిరుమల తిరుపతిని యూనియన్ టెర్రిటరీగా చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. లడ్డూ కల్తీ వివాదంపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు 100 రోజుల పాలన వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకు ముఖ్యమంత్రి ఈ లడ్డూ వివాదం తీసుకొచ్చారని విమర్శించారు.
'తిరుమలను ప్రత్యేక దేశంగా చేయండి'.. మీరు విన్నది నిజమే. ఎవరో సాదాసీదా వ్యక్తి ఈ డిమాండ్ను తెరపైకి తేలేదు. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన రాజకీయ నాయకుడే ఈ అంశాన్ని లేవనెత్తారు. ఆయన మరెవరో కాదు. ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్(KA Paul).
లడ్డూ వ్యవహారంలో బుధవారం మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తిరుమల లడ్డు వివాదంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
Andhrapradesh: గ్లోబల్ పీస్ ఎకానమిక్ సమ్మిట్కు ప్రపంచ శాంతి సభకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల సహా 18 పార్టీలు మద్దతిచ్చాయని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా గ్లోబల్ పీస్ ఎకానమిక్ సమ్మిట్కు మద్దతిస్తున్నట్టు ప్రకటించారన్నారు.
తన సలహా మేరకే అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకొన్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన ఆరోపిస్తున్నారు. ఓట్లు గల్లంతయ్యాయని.. ఈవీఎంలు టాంపరింగ్ జరిగాయని ఆరోపించారు. తనవద్ద అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. బుధవారం నాడు విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన కేఏ పాల్..
లోక్ సభ ఎన్నికల్లో విశాఖ పట్నం నుంచి, అసెంబ్లీ ఎన్నికల్లో గాజువాక నుంచి పోటీ చేసిన కుండ గుర్తుపై పోటీ చేసిన కేఏ పాల్కి(KA Paul) షాక్ తగిలింది.
దేశంలో నరేంద్ర మోదీ(Narendra Modi) మరోసారి ప్రధాని కానున్నట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్(Praja Shanti Party President KA Paul) స్పష్టం చేశారు. ఆయన ప్రధాని ఎందుకు అవుతారో జూన్ 4న చెప్తానన్నారు. ఏపీలో మేమంటే మేము గెలుస్తామని వైసీపీ, టీడీపీలు అంటున్నాయని, విశాఖలో అయితే తానే ఎంపీగా గెలవబోతున్నట్లు ధీమా వ్యక్తం చేశారు.
పోలింగ్ రోజు జరిగిన దాడులు, అనంతర పరిణామాలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఘాటుగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సజావుగా నిర్వహించడంలో ఎలక్షన్ కమిషన్ విఫలమైందని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. ఈవీఎం, వీవీప్యాట్ ధ్వంసం చేయడం వైసీపీ అరాచకానికి పరాకాష్ట అని వ్యాఖ్యానించారు. ఎలక్షన్ కౌంటింగ్ వరకూ పిన్నెల్లిని అరెస్టు చేయొద్దు అంటే అర్థం ఏంటి? అని ఆయన ప్రశ్నించారు. ఇంత దరిద్రపుగొట్టు ఎలక్షన్స్ దేశ చరిత్రలో ఎక్కడా జరగలేదని అసహనం వ్యక్తం చేశారు.