Share News

AP Politics: మంత్రి మిస్సింగ్.. కలకలం రేపుతున్న పోస్టర్లు..!

ABN , Publish Date - Mar 10 , 2024 | 03:36 PM

Prakasam News: ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో(Yerragondapalem) గోడలపై వెలసిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. మంత్రికి(Andhra Pradesh Minister) సంబంధించిన ప్రకటన ఆ పోస్టర్లలో ఉంది. దాంతో ఆ వ్యవహారం చర్చనీయాంశమైంది. మరి ఇంతకీ ఆ పోస్టర్లలో ఏముంది? ఏ మంత్రి గురించి ఆ పోస్టర్లలో పేర్కొన్నారు? వివరాలు తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే..

AP Politics: మంత్రి మిస్సింగ్.. కలకలం రేపుతున్న పోస్టర్లు..!
Minister Adimulapu Suresh

Prakasam News: ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో (Yerragondapalem) గోడలపై వెలసిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. మంత్రికి(Andhra Pradesh Minister) సంబంధించిన ప్రకటన ఆ పోస్టర్లలో ఉంది. దాంతో ఆ వ్యవహారం చర్చనీయాంశమైంది. మరి ఇంతకీ ఆ పోస్టర్లలో ఏముంది? ఏ మంత్రి గురించి ఆ పోస్టర్లలో పేర్కొన్నారు? వివరాలు తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే..

ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో మంత్రి ఆదిమూలపు సురేష్(Minister Suresh) కనిపించడం లేదంటూ వాల్ పోస్టర్లు వెలిశాయి. మంత్రి సురేష్ క్యాంపు కార్యాలయానికి వెళ్లే దారిలో ఉన్న బస్ షెల్టర్‌పై గుర్తు తెలియని వ్యక్తులు పోస్టర్లు అంటించారు. 2019 ఎన్నికల్లో గెలిపించిన ఆదిమూలపు సురేష్ కనిపించడం లేదంటూ పోస్టర్లలో పేర్కొన్నారు. ఆచూకీ తెలిసిన వాళ్లు ఎర్రగొండపాలెం ప్రజలకు తెలియజేయాలని గుర్తు తెలియని వ్యక్తులు సదరు పోస్టర్లలో రాశారు. ఈ పోస్టర్లు స్థానికంగా కలకం రేపుతున్నాయి.

ఈ పోస్టర్లపై మంత్రి సురేష్ అనుచరులు భగ్గుమంటున్నారు. విపక్ష టీడీపీకి చెందిన వారే ఈ పోస్టర్లు అంటించారని ఆరోపిస్తున్నారు. కాగా, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పొలిటికల్‌గా యాక్టీవ్ కావాల్సిన మంత్రివర్యులు.. గత కొంతకాలంగా సైలెంట్ అయ్యారు. మీడియా ముందుకు గానీ, ప్రజల్లోకి గానీ రావడం లేదనే టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా వెలసిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Mar 10 , 2024 | 03:36 PM