Home » Adimulapu Suresh
Prakasam News: ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో(Yerragondapalem) గోడలపై వెలసిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. మంత్రికి(Andhra Pradesh Minister) సంబంధించిన ప్రకటన ఆ పోస్టర్లలో ఉంది. దాంతో ఆ వ్యవహారం చర్చనీయాంశమైంది. మరి ఇంతకీ ఆ పోస్టర్లలో ఏముంది? ఏ మంత్రి గురించి ఆ పోస్టర్లలో పేర్కొన్నారు? వివరాలు తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే..
సీఎం జగన్ సభలో దళిత మంత్రి ఆదిమూలపు సురేష్కు ఘోర అవమానం జరిగింది. ఆదిమూలపు సురేష్తోపాటు ఎర్రగొండపాలెం వైసీపీ అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్కు అవమానం ఎదురైంది.
జగన్ రెడ్డి బదిలీల్లో భాగంగా కొండెపి నియోజకవర్గానికి వచ్చిన మంత్రి ఆదిమూలపు సురేశ్ (Minister Adimulapu Suresh) గెలుపుకోసం అడ్డదారులు తొక్కుతున్నారని టీడీపీ శాసనసభ్యులు డోలా బాల వీరాంజనేయస్వామి (Bala Veeranjaneya Swamy) అన్నారు.
Andhrapradesh: స్వచ్ఛ సర్వేక్షన్లో ఆంధ్రప్రదేశ్కు అవార్డుల పంట పండింది. ఆల్ ఇండియా లెవెల్లో నాలుగు ర్యాంకులను రాష్ట్రం కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. స్వచ్ఛ సర్వెక్షన్ 2023లో ఏపీ నాలుగు జాతీయ అవార్డులు, ఒక రాష్ట్ర స్థాయి అవార్డు గెలుచుకుందన్నారు.
మున్సిపల్ కార్మికుల సమ్మె విరమించాలని ఆయా సంఘాలతో చర్చలు జరిగాయని మంత్రి ఆదిమూలపు సురేష్ ( Minister Suresh ) తెలిపారు. మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... చర్చల తర్వాత వారి డిమాండ్ల మేరకు కొన్ని జీవోలు కూడా విడుదల చేయాలని నిర్ణయించామన్నారు. నాన్ పీహెచ్ కేటగిరీ ఉద్యోగులకూ రూ.6 వేల ఆక్యుపేషనల్ హెల్త్ అలవెన్స్ ఇస్తామని మంత్రి సురేష్ చెప్పారు.
Andhrapradesh: ఒంగోలులో మంత్రి ఆదిమూలపు సురేష్కు అసమ్మతి సెగ తగిలింది. ఒంగోలులోని క్యాంపు కార్యాలయంలో మంత్రి ఆదిమూలపు సురేష్ నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు.
Andhrapradesh: పారిశుద్ధ్య కార్మికులు దయచేసి విధులకు హాజరుకావాలని కోరుతున్నామని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... మున్సిపల్ కార్మికుల సమ్మెతో ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టామన్నారు.
మున్సిపల్ కార్మిక సంఘాలతో మంత్రి అదిమూలపు సురేష్ చర్చలు విఫలమయ్యాయి. మున్సిపాల్టీలలో సమ్మెలో పాల్గొన్న సీఐటీయూ నేతలతో మంత్రి చర్చలు ముగిశాయి. రెండున్నర గంటల పాటు మంత్రి, యూనియన్ నేతల మధ్య చర్చలు కొనసాగాయి. ఈ చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. సమ్మె విరమించాలని యూనియన్ నేతలను మంత్రి సురేష్ కోరారు.