Adimulapu Suresh: ఒంగోలులో మంత్రి ఆదిమూలపు సురేష్కు అసమ్మతి సెగ
ABN , Publish Date - Jan 01 , 2024 | 04:42 PM
Andhrapradesh: ఒంగోలులో మంత్రి ఆదిమూలపు సురేష్కు అసమ్మతి సెగ తగిలింది. ఒంగోలులోని క్యాంపు కార్యాలయంలో మంత్రి ఆదిమూలపు సురేష్ నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు.
![Adimulapu Suresh: ఒంగోలులో మంత్రి ఆదిమూలపు సురేష్కు అసమ్మతి సెగ](https://media.andhrajyothy.com/media/2023/20231205/adimulapu_suresh_172da4d65f.jpg)
ప్రకాశం, జనవరి1 : ఒంగోలులో మంత్రి ఆదిమూలపు సురేష్కు (Minister Adimulapu Suresh) అసమ్మతి సెగ తగిలింది. ఒంగోలులోని క్యాంపు కార్యాలయంలో మంత్రి ఆదిమూలపు సురేష్ నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. అయితే నూతన సంవత్సర వేడుకల్లో అశోక్ రెడ్డికి ప్రాధాన్యత ఇచ్చారంటూ రవిరెడ్డి వర్గం అలిగి వెళ్లిపోయింది. దీంతో రవిరెడ్డి వర్గానికి సర్దిచెప్పేందుకు మంత్రి సురేష్ గన్మెన్లు, పీఏ ప్రయత్నించారు. అయినప్పటికీ మంత్రి సురేష్ వైఖరికి నిరసనగా రవిరెడ్డి వర్గం క్యాంపు కార్యాలయం నుంచి వెళ్లిపోయింది. ఈ విషయంపై మంత్రి స్పందన ఎలా ఉంటుందో చూడాలి మరి.