Share News

Raghu Rama: నాకెలాంటి భయం లేదు.. పవన్‌ హామీ ఇచ్చారు!

ABN , Publish Date - Apr 09 , 2024 | 03:04 PM

తనకు ఎవరూ లేరు అని అంతా అనుకుంటున్నారని, ఇప్పుడు టీడీపీ, జనసేన అండగా ఉన్నాయని, తనకు ఎలాంటి భయమూ లేదని.. పవన్‌కల్యాణ్‌ను కూడా హామీ ఇచ్చారని టీడీపీ నేత, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. మంగళవారం ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో భేటీ అయ్యారు.

Raghu Rama: నాకెలాంటి భయం లేదు.. పవన్‌ హామీ ఇచ్చారు!

కాకినాడ: తనకు ఎవరూ లేరు అని అంతా అనుకుంటున్నారని, ఇప్పుడు టీడీపీ, జనసేన అండగా ఉన్నాయని, తనకు ఎలాంటి భయమూ లేదని.. పవన్‌కల్యాణ్‌ను (Janasena Chief Pawan Kalyan) కూడా హామీ ఇచ్చారని టీడీపీ నేత, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు (MP Raghurama Krishnaraju) అన్నారు. మంగళవారం ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పవన్‌కు ఉగాది శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చానని చెప్పారు. అరాచక పాలన చేస్తున్న జగన్‌ను సాగనంపాలని పిలుపునిచ్చారు.

తనకు ఎవరూ లేరనుకున్నారని, ఇప్పుడు తనకు టీడీపీ, జనసేన అండగా ఉంటాయని రఘురామకృష్ణరాజు చెప్పారు. తనకు ఎలాంటి భయం లేదని, ఇటు ప్రజాక్షేత్రంలో, అటు చట్టసభల్లో ఉంటానని స్పష్టం చేశారు. అయితే ఏ సభకు పోటీ చేయాలి అనేది త్వరలోనే తెలుస్తుందన్నారు. తన ఎన్నికల ప్రచారానికి పవన్ కళ్యాణ్‌ను రమ్మని అడిగినట్లు రఘురామకృష్ణరాజు తెలిపారు. ఇందుకు పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారని చెప్పారు. తన విజయానికి సహకరించిం, ప్రచారం చేస్తానని పవన్ హామీ ఇచ్చారని రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు.

Updated Date - Apr 09 , 2024 | 04:03 PM