Home » TDP-Janasena- BJP
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు-2024, లోక్సభ ఎన్నికలు -2024 పోలింగ్ కొనసాగుతోంది. చాలా ప్రాంతాల్లో వైసీపీ మూకలు హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నాయి. రౌడీయిజం, దౌర్జన్యాలతో వైసీపీ శ్రేణులు భయభ్రంతాలకు గురిచేస్తున్నాయి. రాప్తాడు నియోజకవర్గం, పల్నాడు, అన్నమయ్య జిల్లాల్లో పలు చోట్ల ఘర్షణలు, దాడులు జరిగాయి. కాగా ఈసారి పోలింగ్ భారీగా నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. సాయంత్రం 3 గంటల సమయానికి ఏపీలో ఓటింగ్ 55.49 శాతంగా నమోదయింది. దీంతో కూటమి నేతల్లో జోష్ కనిపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు (AP Elections) ఒకట్రెండ్రోజుల ముందు కూడా వైసీపీ (YSR Congress) అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఆటలు ఆడుతోంది. అధికారులు, పోలీసులు ఇలా ఎవర్ని ఎక్కడ వాడాలో అలా వాడేస్తోంది జగన్ సర్కార్. మరీ ముఖ్యంగా జిల్లాల్లో, నియోజకవర్గాల్లో అయితే వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు చెప్పిందే వేదం అన్నట్లుగా అధికారులు ప్రవర్తిస్తుండటం దారుణం...
21 స్థానాల్లో అభ్యర్థులను దింపిన జనసేనాని ఈ ఎన్నికల్లో సంకీర్ణ ప్రభుత్వం నిర్మాతగా.. కింగ్ మేకర్గా వ్యవహరిస్తారా? అని పవన్ కల్యాణ్ను ప్రశ్నించగా.. చట్టసభల్లో ప్రజల గొంతుకగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.
టీడీపీ అధినేత నారా చంద్రబాబు (Chandrababu), జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మేనిఫెస్టోను (NDA Manifesto) రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేనిఫెస్టోపై చిత్రవిచిత్రాలుగా కామెంట్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే మేనిఫెస్టోలో బీజేపీ పాత్ర ఎందుకు లేదు..? ఫోటోలు ఎందుకు లేవు..? అనే విషయాలపై క్లియర్ కట్గా చంద్రబాబే చెప్పినప్పటికీ కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో కొందరు ఇష్టానుసారం వ్యాఖ్యలు చేసిన పరిస్థితి...
ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) మేనిఫెస్టో (NDA Manifesto) వచ్చేసింది. దీంతో మేనిఫెస్టో ఏయే వర్గాలకు ఏమేం శుభవార్తలు చెప్పారు..? పెన్షన్లు ఎంత పెంచారు..? విద్యార్థులకు కూటమి ఇచ్చిన హామీలేంటి..? రైతన్నలకు చంద్రన్న చెప్పిన ప్రకటనలేంటి..? మహిళలకు ఏమేం ఉచితమని చెప్పారు..? బీసీలు, ముస్లిం మైనార్టీలకు ఎన్డీఏ ఎలాంటి శుభవార్తలు చెప్పింది..? ఇలా ఒకటా రెండా.. ఆయా వర్గాలు నిశితంగా మేనిఫెస్టో చదివే పనిలో నిమగ్నమయ్యాయి..
వైసీపీ మేనిఫెస్టో (YSRCP Manifesto) విడుదల కావడంతో.. కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తుందా..? అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకే విడుదల కావాల్సిన మేనిఫెస్టో కొన్ని అనివార్య కారణాల వల్ల మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేయడం జరిగింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. బీజేపీ ముఖ్యనేతలతో కలిసి మేనిఫెస్టో రిలీజ్ చేశారు.
టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ (Chandrababu, Pawan Kalyan) రిలీజ్ చేశారు. ఇందులో ఒక్కో పథకం ఒక్కో రీతిలో రాష్ట్ర ప్రజలను ఆకట్టుకునేలా ఉంది. మరీ ముఖ్యంగా.. ఇటీవల వైసీపీ మేనిఫెస్టోలో (YSRCP Manifesto) పెన్షన్లు రూ. 3500 పెంచుతామని ప్రకటించిన సంగతి తెలిసిందే. కూటమి మాత్రం...
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల (AP Elections 2024) ముందు చిత్ర విచిత్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ (TDP, Janasena, BJP) పార్టీల్లో టికెట్లు దక్కని ఆశావహులు పలుచోట్ల రెబల్స్గా మారిన సంగతి తెలిసిందే. దీంతో ఆ నేతలతో కూటమికి పెద్ద తలనొప్పే వచ్చిపడింది. అదెలాగంటే..
2019 ఎన్నికలకు ఏడాది ముందు నుంచి నడిపిన ‘పింక్ డైమండ్ పాయె’ నాటకమే దీనికి నిదర్శనం.
దమ్మున్న చానెల్ ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణ (ABN MD Radha Krishna) పెన్ను పట్టి ‘కొత్తపలుకు’ (Kothapaluku) రాసినా.. టీవీలో కూర్చుని ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ (Open Heart With RK) ఇంటర్వ్యూ చేసినా అదో సంచలనమే అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రజల మన్ననలు పొందింది. ఇప్పటి వరకూ ఎందరో సినీ, రాజకీయాలతో పాటు ఇతర రంగాల ప్రముఖులను ఇంటర్వ్యూ చేసి.. సంచలనమే సృష్టించారు...