Share News

AP Politics: పురంధేశ్వరిని కలిసిన మంద కృష్ణ మాదిగ.. ఎందుకంటే..?

ABN , Publish Date - Mar 25 , 2024 | 09:55 PM

బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి(Daggubati Purandeswari)ని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ(Manda Krishna Madiga) మర్యాద పూర్వకంగా కలిశారు. సోమవారం నాడు బీజేపీ కార్యాలయంలో రెండు గంటల పాటు చర్చలు జరిపారు. రాబోయే ఎన్నికలకు సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించారు.

AP Politics: పురంధేశ్వరిని కలిసిన మంద కృష్ణ మాదిగ.. ఎందుకంటే..?

విజయవాడ: బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి(Daggubati Purandeswari)ని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ(Manda Krishna Madiga) మర్యాద పూర్వకంగా కలిశారు. సోమవారం నాడు బీజేపీ కార్యాలయంలో రెండు గంటల పాటు చర్చలు జరిపారు. రాబోయే ఎన్నికలకు సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించారు.

ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి మద్దతిస్తామని మంద కృష్ణ మాదిగ తెలిపారు. ఎన్డీఏ అభ్యర్థులు గెలవడానికి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కృషి చేస్తుందని అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభివృద్ధి, సంక్షేమం ఏకకాలంలో నడిపిస్తున్నారని మంద కృష్ణ మాదిగ తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు బీజేపీ కట్టుబడి ఉందని పురంధేశ్వరి తెలిపారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 25 , 2024 | 09:56 PM