Home » Manda Krishna Madiga
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పెద్ద పేట రామాలయం అంశంపై ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ స్పందించారు. దళిత వర్గాలకు చెందిన వారిని ఎవరు ఇబ్బంది పెట్టినా, ఆత్మ గౌరవం దెబ్బ తీసేలా వ్యవహరించినా ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు.
హైడ్రాపై ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు, పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ షాకింగ్ కామెంట్స్ చేశారు. అమీన్ పూర్ మండలం ఐలాపూర్ గ్రామంలోని వివాదంలో ఉన్న భూముల రైతులను మంద కృష్ణ మాదిగ, హైకోర్టు అడ్వకేట్ ముఖీం పరామర్శించారు.
ఏఐసీసీ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్గాంధీకి ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు.
చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాపై దాడికి నిరసనగా తెలుగు రాష్ట్రాల్లో ఆందోళనలు చేశామని మంద కృష్ణ మాదిగ అన్నారు. ఈ విషయంపై రాష్ట్రపతిని కలుస్తామన్నారు.
ధర్మం, విశ్వాసాల ముసుగులో దళితులపై దాడులు చేస్తున్న వారికి తగిన గుణపాఠం నేర్పుతామని మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ పై దాడిని దేశంలోని 30 కోట్ల మంది దళితులపై దాడిగా భావిస్తున్నట్లు ఆయన అభివర్ణించారు.
ఆత్మగౌరవం కంటే తమకు ఏదీ ముఖ్యం కాదని, దళిత జాతి ఆత్మగౌరవానికి ఆటంకం కలిగితే ఎంతటి పోరాటానికైనా సిద్ధమని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ స్పష్టం చేశారు.
ఈ నెల 9న తలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని ఉప రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేస్తున్నామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ తెలిపారు.
ఏపీ సీఎం చంద్రబాబును చూసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ నేర్చుకోవాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ సూచించారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభివృద్ధికి మందకృష్ణ మాదిగ ఎనలేని కృషి చేశారని, ఆయన అలుపెరుగని పోరాటంతోనే ఎస్సీ వర్గీకరణ సాధ్యమైందని కేంద్రమంత్రి జి. కిషన్రెడ్డి అన్నారు.
రాష్ట్రంలోని పింఛన్దారులను సీఎం రేవంత్రెడ్డి మోసగిస్తున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ మండిపడ్డారు.