Home » Manda Krishna Madiga
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) మోసగాడని.. తమను నిలువునా మోసం చేశారని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ (Manda Krishna Madiga) అన్నారు. కేసీఆర్కి మనం అండగా నిల్చున్న రోజులు చాలా ఉన్నాయని.. ఆయన మనల్ని పట్టించుకోలేదని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని ఆయన మాట తప్పాడనీ ప్రశ్నిస్తే తనను జైల్లో పెట్టించారని విరుచుకుపడ్డారు.
మాదిగలకు టిక్కెట్ల కేటాయింపులో అన్యాయం చేసిన సీఎం రేవంత్ రెడ్డికి లోక్సభ ఎన్నికల్లో తమ సత్తా ఏమిటో చూపిస్తామని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు(Motkupalli Narsimhulu) అన్నారు. కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఆయన అన్నారు.
Telangana: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి ఓ బ్రోకర్ అంటూ వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యమం చేసి సీఎం కాలేదని.. బోకరిజం చేస్తూ సీఎం అయ్యారని కామెంట్స్ చేశారు. ప్రజాభిమానం ఉంటే రేవంత్ రెడ్డి కామారెడ్డిలో ఓడిపోయేవాడు కాదన్నారు. కడియం శ్రీహరిని తానే పిలిచాను అని రేవంత్ అన్నారని..
కాంగ్రెస్ (Congress) హయాం మొత్తం స్కామ్లేనని ఎమ్మార్పీఎస్ అభ్యక్షుడు మందకృష్ణ మాదిగ (Mandakrishna Madiga) ఆరోపించారు. ఆదివారం నాడు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మాదిగల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మందకృష్ణ మాదిగ, బీజేపీ మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ హాజరయ్యారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి(Daggubati Purandeswari)ని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ(Manda Krishna Madiga) మర్యాద పూర్వకంగా కలిశారు. సోమవారం నాడు బీజేపీ కార్యాలయంలో రెండు గంటల పాటు చర్చలు జరిపారు. రాబోయే ఎన్నికలకు సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించారు.
తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయడును ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ(Manda Krishna Madiga) కలిశారు. ఎస్సీ వర్గీకరణ, మాదిగలకు రాజకీయ ప్రాధాన్యతపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. 35 అంశాలతో కూడిన వినతి పత్రాన్ని చంద్రబాబుకి మందకృష్ణ అంజేశారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ... సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ నిర్ణయం తీసుకుందని తెలిపారు.
రేవంత్ పాలన మీద మాదిగల తిరుగుబాటు ఎలా ఉంటుందో భవిష్యత్లో చూపిస్తామని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణమాదిగ(Manda Krishna Madiga) హెచ్చరించారు. మాదిగలను రెచ్చగొడితే.. జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ మీద సీఎం రేవంత్ చేయించింది డూప్లికేట్ యుద్ధమేనని ఎద్దేవా చేశారు.
ఎస్సీ వర్గీకరణ పేరుతో రాజకీయ ప్రయోజనాల కోసం మాదిగలను బీజేపీ(BJP), బీఆర్ఎస్ (BRS) పార్టీలు వాడుకుంటున్నాయని మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్(Sampath Kumar) అన్నారు. శుక్రవారం నాడు గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... రెండున్నర దశాబ్దాలుగా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వర్గీకరణ పేరుతో మాదిగల హక్కులను మోసం చేసే కుట్రలు జరుగుతున్నాయని చెప్పారు.
ఏపీలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల కోసం తెలుగుదేశం, బీజేపీ జనసేనలతో కూడిన ఎన్డీఏ కూటమికి తాము మద్దతిస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ (MRPS) వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ (Manda Krishna Madiga) తెలిపారు. సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... జగన్ ప్రభుత్వంలో ఉమ్మడి దళితులకు అన్యాయం జరిగిందని చెప్పారు.
తెలంగాణ ప్రజలు ఆకలినైన భరిస్తారు కానీ, ఆత్మగౌరవం మీద దెబ్బ కొడతామంటే సహించరు.. అందుకే నియంతృత్వం