Share News

YSRCP: నంద్యాల జిల్లాలో వైసీపీకి మరో షాక్..

ABN , Publish Date - Mar 25 , 2024 | 01:26 PM

నంద్యాల జిల్లాలో వైఎస్సార్‌సీపీకి మరో షాక్ తగిలింది. నంద్యాల జడ్పీటీసీ సభ్యుడు గోపవరం గోకుల్ కృష్ణారెడ్డి వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేశారు. ఇవాళ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్‌లో చేరారు. గోకుల్ కృష్ణారెడ్డి కి కండువా కప్పి పార్టీలోకి షర్మిల ఆహ్వానించారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. వైసీపీ కోసం ఎంతో కష్టపడి పని చేశానని.. అయినా గుర్తింపు లేదన్నారు.

YSRCP: నంద్యాల జిల్లాలో వైసీపీకి మరో షాక్..

నంద్యాల: నంద్యాల జిల్లాలో వైఎస్సార్‌సీపీ (YSRCP)కి మరో షాక్ తగిలింది. నంద్యాల జడ్పీటీసీ సభ్యుడు గోపవరం గోకుల్ కృష్ణారెడ్డి (Gokul Krishna Reddy) వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేశారు. ఇవాళ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి (YS Sharmila) సమక్షంలో ఆయన కాంగ్రెస్‌ (congress)లో చేరారు. గోకుల్ కృష్ణారెడ్డి కి కండువా కప్పి పార్టీలోకి షర్మిల ఆహ్వానించారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. వైసీపీ కోసం ఎంతో కష్టపడి పని చేశానని.. అయినా గుర్తింపు లేదన్నారు. పార్టీ కోసం చేసిన సేవలకు కనీసం మర్యాద కూడా దక్క లేదన్నారు. వైసీపీ తనపై కక్షపూరితంగా వ్యవహరించిందని.. కాంగ్రెస్ లో చేరడం చాలా సంతోషంగా ఉందన్నారు. సొంత ఇంటికి వచ్చినట్లు ఉందని కృష్ణారెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్ అభివృద్ధి కోసం కష్టపడతామని.. పార్టీని అధికారంలో తెస్తామని కృష్ణారెడ్డి తెలిపారు.

Gokul.jpg

TDP: వైసీపీలో సీఎం అభ్యర్థిపై ఆ పార్టీ నేతల్లోనే చర్చ: రవి నాయుడు

అసలు గోకుల్ పార్టీ మారడానికి కారణమేంటంటే..

నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్‌ రెడ్డి (Nandyala MLA Shilpa Ravichandra Kishore Reddy), నంద్యాల జెడ్పీటీసీ గోకుల్ కృష్ణారెడ్డిల (Nandyala ZPTC Gokul Krishna Reddy) మధ్య వర్గపోరు గత కొంతకాలంగా కొనసాగుతోంది. శిల్పా రవి స్థానికేతరుడని.. నంద్యాల టికెట్ తనకే ఇవ్వాలంటూ వైసీపీ పెద్దలను గోకుల్ కోరారు. ఎమ్మెల్యే రవిపై విమర్శలు గుప్పిస్తూ.. హెచ్చరికలు చేయడం చర్చనీయంశంగా మారింది. ఈ క్రమంలో రెండు దశాబ్దాలుగా స్థానికేతరుల కబంధ హస్తాల్లో నలిగిపోతున్న నంద్యాలకు విముక్తి కల్పించాలంటూ గోకుల్ ఇటీవల ఆత్మ గౌరవ ఓదార్పు యాత్రను కూడా చేపట్టారు. అయితే గోకుల్ యాత్రను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అరాచకాలన్నీ బయటపెడతానంటూ ఎమ్మెల్యే రవికి బహిరంగంగా వార్నింగ్ కూడా ఇచ్చారు.

Budda venkanna: మంగళగిరిలో లోకేష్‌ను ఓడించటానికి రూ.500 కోట్లు దాచారు..

అయితే ఓదార్పు యాత్రను అడ్డుకున్నప్పటికీ వెనక్కి తగ్గేదే లే అంటూ అనంతరం గోకుల్ మౌనదీక్షకు పూనుకున్నారు. దీంతో మౌనదీక్షను కూడా భగ్నం చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేపట్టారు. గోకుల్ స్వగ్రామం భీమవరంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. గ్రామానికి భారీగా పోలీసు బలగాలు చేరుకుంటున్నాయి. మరోవైపు గోకుల్ కార్యాలయం పోలీసుల అధీనంలోకి వెళ్లింది. విషయం తెలిసిన గోకుల్ అభిమానులు భారీగా గ్రామానికి భారీగా చేరుకున్నారు. నంద్యాల - భీమవరం రహదారిలో పోలీస్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. ఎలాగానై మౌనదీక్షను అడ్డుకోవాలని పోలీసులు భావిస్తుండగా.. మౌన దీక్ష చేసి తీరుతానని గోకుల్ తేల్చిచెబుతున్నారు. దీంతో నంద్యాలలో టెన్షన్ వాతావరణం నెలకొంది.

కాగా... నంద్యాల వైసీపీ జడ్పీటీసీగా ఉన్న గోకుల్ కృష్ణారెడ్డి వచ్చే ఎన్నికలలో నంద్యాల అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్న సంగతి తెలిసిందే. అందుకోసం జనాల్లోకి వెళుతూ.. ఎమ్మెల్యే శిల్పా రవి లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తున్నారు. జనాల్లో సింపతి పొందేందుకు లోకల్, నాన్ లోకల్ అని అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. మరోవైపు గోకుల్ కృష్ణారెడ్డిని అడ్డుకునేందుకు ఎమ్మెల్యే శిల్పా రవి గట్టి ప్రయాత్నాలు చేస్తున్నారు. గోకుల్ యాత్ర గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులతో బ్రేక్ వేయించినట్లు సమాచారం. దీంతో నంద్యాలలో ఇద్దరు నేతల ఆధిపత్య పోరు తీవ్రస్థాయికి చేరింది. మొత్తానికి గోకుల్ వైఎస్సార్‌సీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Chinarajappa: కొందరు అధికారులకు జగన్ వాసన ఇంకా పోలేదు

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 25 , 2024 | 01:30 PM