Share News

AP NEWS: వైసీపీకి భారీ షాక్.. టీడీపీలోకి కీలక నేతలు

ABN , Publish Date - Feb 11 , 2024 | 09:19 PM

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో అధికార వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. వైసీపీ హై కమాండ్‌పై అసంతృప్త నేతలు వరుసగా తిరుగుబాపుటా ఎగురవేస్తున్నారు.

AP NEWS: వైసీపీకి భారీ షాక్..  టీడీపీలోకి కీలక నేతలు

చిత్తూరు: ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో అధికార వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. వైసీపీ హై కమాండ్‌పై అసంతృప్త నేతలు వరుసగా తిరుగుబాపుటా ఎగురవేస్తున్నారు. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. వైసీపీ నుంచి టీడీపీలోకి నేతలు భారీగా చేరారు. పెనుమూరు మండలం గొడుగుమానుపల్లిలో వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ,నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ డాక్టర్ థామస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీ అరాచక పాలన సహించలేక తాము టీడీపీలో చేరామని నేతలు తెలిపారు. ఏపీ అభివృద్ధి జరగాలంటే మళ్లీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని వారు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి పాలన దోచుకోవడం, దాచుకోవడం తప్ప అభివృద్ధి ఏమి లేదని అన్నారు.

గోపాలపురం నియోజకవర్గంలో...

తూ.గో.జిల్లా: గోపాలపురం నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది.. వైసీపీ నుంచి తెలుగుదేశంలో 400 మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు చేరారు. తెలుగుదేశం కండువా కప్పి పార్టీలోకి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ మద్దిపాటి వెంకట రాజు ఆహ్వానించారు. అనంతరం గోపాలపురం మండల టీడీపీ నూతన కార్యాలయాన్ని పార్టీ జిల్లా అధ్యక్షులు కేఎస్ జవహర్, వెంకటరాజు ప్రారంభించారు.

Updated Date - Feb 11 , 2024 | 10:59 PM