Share News

TDP Vs YSRCP: ఆసక్తికరంగా మామా అల్లుళ్ల ఫైట్.. పెదకూరపాడులో టెన్షన్ టెన్షన్

ABN , Publish Date - Mar 15 , 2024 | 11:44 AM

Andhrapradesh: జిల్లాలోని పెదకూరపాడు నియోజకవర్గంలో టీడీపీ - వైసీపీ మధ్య వార్ తారాస్థాయికి చేరుకుంది. గత రాత్రి అనంతవరం, దోడ్లేరు గ్రామాల్లో పెదకూరపాడు టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్‌కు చెందిన ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు చించేశారు. అయితే ఉదయం తొమ్మిది గంటల సమయంలో అమరావతి మండలం ధరణికోటలో వైసీపీ కార్యాలయానికి కొందరు వ్యక్తులు నిప్పు పెట్టారు.

TDP Vs YSRCP:  ఆసక్తికరంగా మామా అల్లుళ్ల ఫైట్.. పెదకూరపాడులో టెన్షన్ టెన్షన్

పల్నాడు, మార్చి 15: జిల్లాలోని పెదకూరపాడు నియోజకవర్గంలో టీడీపీ (TDP) - వైసీపీ (YSRCP) మధ్య వార్ తారాస్థాయికి చేరుకుంది. గత రాత్రి అనంతవరం, దోడ్లేరు గ్రామాల్లో పెదకూరపాడు టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్‌కు (TDP Candidate Bhasyam Praveen) చెందిన ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు చించేశారు. అయితే ఉదయం తొమ్మిది గంటల సమయంలో అమరావతి మండలం ధరణికోటలో వైసీపీ కార్యాలయానికి కొందరు వ్యక్తులు నిప్పు పెట్టారు. ఈ వ్యవహారంపై వైసీపీకి చెందిన బండ్లమూడి పూర్ణచంద్రరావు (YSRCP Leader Bandlamudi Purnachandra rao) పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో టీడీపీకి చెందిన ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాలుగు రోజుల క్రితమే వైసీపీ ఆఫీస్‌ను ఎమ్మెల్యే నంబూరు శంకరరావు, ఎంపీ అభ్యర్ది అనిల్ కుమార్ యాదవ్ ప్రారంభించారు. అయితే ఇంతలోని ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడంతో పెదకూరపాడు నియోజకవర్గంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. పెదకూరపాడులో మామ అల్లుళ్ళ మధ్య ఫైట్ ఆసక్తికరంగా మారింది.

ఇవి కూడా చదవండి..

Chandrababu: అమ్మకానికి ఏపీపీఎస్సీ ఉద్యోగాలు.. జగన్ సర్కారుపై చంద్రబాబు ఆగ్రహం

BRS: తమ్ముడి అరెస్టుపై కన్నీరు పెట్టిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 15 , 2024 | 11:46 AM