Share News

Pinnelli Ramakrishna: పిన్నెల్లి అరాచకం.. వెలుగులోకి మరో వీడియో..

ABN , Publish Date - May 24 , 2024 | 08:43 AM

పోలింగ్‌ రోజు మాచర్ల వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన అకృత్యాలు ఒక్కొక్కటి ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి. పిన్నెల్లి హింసాపర్వాన్ని పట్టించే మరో వీడియో తాజాగా వైరల్‌ అయింది. మాచర్ల నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలం కొత్తపుల్లారెడ్డిగూడెంలో 118, 119, 120 పోలింగ్‌ బూత్‌లలో కేతావత్‌ రేఖ్యానాయక్‌, హనుమంతునాయక్‌, బాణావత్‌ చిన ..

Pinnelli Ramakrishna: పిన్నెల్లి అరాచకం.. వెలుగులోకి మరో వీడియో..
Pinnelli Ramakrishna

  • గిరిజనులనూ వదలని పిన్నెల్లి..

  • పోలింగ్‌ కేంద్రం నుంచి

  • టీడీపీ ఏజెంట్ల తరిమివేత

  • పారిపోతున్న రేఖ్యానాయక్‌పై దాడి

  • ఏజెంట్లను బలవంతంగా

  • కారులోకి ఎక్కించి తరలింపు..

మాచర్ల, మే 24: పోలింగ్‌ రోజు మాచర్ల వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన అకృత్యాలు ఒక్కొక్కటి ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి. పిన్నెల్లి హింసాపర్వాన్ని పట్టించే మరో వీడియో తాజాగా వైరల్‌ అయింది. మాచర్ల నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలం కొత్తపుల్లారెడ్డిగూడెంలో 118, 119, 120 పోలింగ్‌ బూత్‌లలో కేతావత్‌ రేఖ్యానాయక్‌, హనుమంతునాయక్‌, బాణావత్‌ చిన మంత్రియానాయక్‌, మల్లునాయక్‌, మూఢావత్‌ అంజినాయక్‌, తులస్యానాయక్‌, సంతోష్‌నాయక్‌లు టీడీపీ ఏజెంట్లుగా కూర్చున్నారు. అక్కడకు వచ్చిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. వారిని బయటకు లాగేయమని తన అనుచరులను ఆదేశించారు.


దీంతో వైసీపీ మూకలు ఆ ఏజెంట్లను బయటకు లాగేశారు. టెంట్లు పడేసి దాడికి పాల్పడ్డారు. టీడీపీ ఏజెంట్లను పిన్నెల్లి బలవంతంగా తన కార్లో ఎక్కిస్తుండగా, రేఖ్యానాయక్‌ పరారయ్యాడు. వైసీపీ మూకలు వెంటపడి కర్రలు, మారణాయులతో రేఖ్యానాయక్‌పై దాడి చేసి గాయపరిచారు. మిగిలిన టీడీపీ ఏజెంట్లను కారులో బలవంతంగా ఎక్కించుకుని పోలింగ్‌కేంద్రానికి దూరంగా మాచర్లలో పిన్నెల్లి వదిలేశారు. రేఖ్యానాయక్‌ను బంధువులు మాచర్ల ఆస్పత్రికి తరలించారు. కాగా, మాచర్ల మండలం రాయవరంలో 51వ పోలింగ్‌ బూత్‌లో టీడీపీ ఏజెంట్లపై వైసీపీ మూకలు దాడిచేశాయి. అడ్డువచ్చిన పోలీసులపైనా దౌర్జన్యం చేశారు.

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - May 24 , 2024 | 08:45 AM