Share News

AP News: అమెరికాలో గుంటూరు విద్యార్థి దారుణ హత్య

ABN , Publish Date - Mar 16 , 2024 | 10:18 AM

Andhrapradesh: అమెరికాలో గుంటూరు జిల్లా విద్యార్థి దారుణ హత్య కలకలం రేపుతోంది. బోస్టన్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్న పరుచూరి అభిజిత్ (20)‌ను ఈనెల 11న యూనివర్సిటీ క్యాంపస్లోనే గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు. సెల్ నెంబర్ ఆధారంగా మృతదేహాన్ని పోలీసులు అడవిలో గుర్తించారు. అనంతరం కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.

AP News: అమెరికాలో గుంటూరు విద్యార్థి దారుణ హత్య

గుంటూరు, మార్చి 16: అమెరికాలో (America) గుంటూరు జిల్లా (Guntur) విద్యార్థి (Student) దారుణ హత్య కలకలం రేపుతోంది. బోస్టన్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్న పరుచూరి అభిజిత్ (20)‌ను ఈనెల 11న యూనివర్సిటీ క్యాంపస్లోనే గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు. సెల్ నెంబర్ ఆధారంగా మృతదేహాన్ని పోలీసులు అడవిలో గుర్తించారు. అనంతరం కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. శుక్రవారం రాత్రి స్వస్థలం బుర్రిపాలెం గ్రామానికి అభిజిత్ మృతదేహం చేరుకుంది. అభిజిత్ మృతదేహాన్ని చూసి తల్లిదండ్రుల పరుచూరి చక్రధర్, శ్రీలక్ష్మి బోరున విలపిస్తున్నారు. చదువకోడానికి వెళ్లిన బిడ్డ విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు బాధ వర్ణణాతీతం. అభిజిత్ మృతదేహానికి ఈరోజు అంత్యక్రియలు జరుగనున్నాయి.

ఇవి కూడా చదవండి..

CM Revanth: సీఎంగా తొలిసారి ఏపీకి రేవంత్... కామెంట్లపై సర్వత్రా ఆసక్తి

Arvind Kejriwal: రౌస్ అవెన్యూ కోర్టుకు హాజరైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. మరి కాసేపట్లో కవిత హాజరు


మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 16 , 2024 | 10:21 AM