Share News

Delhi: తాజ్ ఎక్స్‌ప్రెస్ ప్యాసింజర్ రైల్లో చెలరేగిన మంటలు..

ABN , Publish Date - Jun 03 , 2024 | 07:08 PM

తాజ్ ఎక్స్‌ప్రెస్(Taj Express) ప్యాసింజర్ రైల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి రెండు బోగీలు దగ్ధమయ్యాయి. ఈ ఘటన తుగ్లకాబాద్-ఓక్లా మధ్య జరిగింది. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని ఢిల్లీ ఉత్తర రైల్వే అధికారులు వెల్లడించారు. 12280 నంబరు గల తాజ్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదానికి గురైనట్లు వారు తెలిపారు.

Delhi: తాజ్ ఎక్స్‌ప్రెస్ ప్యాసింజర్ రైల్లో చెలరేగిన మంటలు..

ఢిల్లీ: తాజ్ ఎక్స్‌ప్రెస్(Taj Express) ప్యాసింజర్ రైల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి రెండు బోగీలు దగ్ధమయ్యాయి. ఈ ఘటన తుగ్లకాబాద్-ఓక్లా మధ్య జరిగింది. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని ఢిల్లీ ఉత్తర రైల్వే అధికారులు వెల్లడించారు. 12280 నంబరు గల తాజ్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదానికి గురైనట్లు వారు తెలిపారు. సాయంత్రం 4:30గంటలకు సమయంలో ప్రమాదం జరిగినట్లు తమకు ఫోన్ కాల్ వచ్చినట్లు ఢిల్లీ ఫైర్ సర్వీసెస్(DFS) అధికారి తెలిపారు. 8ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పుతున్నట్లు వెల్లడించారు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉండడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

For Latest News and National News click here

Updated Date - Jun 03 , 2024 | 07:46 PM