Home » Train Accident
ఢిల్లీ డివిజన్లోని గాజియాబాద్-న్యూఢిల్లీ రైల్వే మార్గంలో ఇవాళ (మంగళవారం) ఉదయం రైలు ప్రమాదం సంభవించింది. సరకుల లోడుతో వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఆరు బోగీలు అకస్మాత్తుగా పట్టాలు తప్పడంతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఏలూరు జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఉంగుటూరు మండలం చేబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ఢీకొనడంతో నలుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు.
బిహార్లోని మధుబని రైల్వే స్టేషన్లో గురువారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. జయనగర్-ఉద్నా అంత్యోదయ ఎక్స్ప్రెస్ రైలు అగ్నిప్రమాదానికి గురైంది. ఓ ఖాళీ బోగీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
హౌరా-రక్సాల్ మిథిలా ఎక్స్ప్రెస్లో మంటలు సాధారణ ప్రమాదం కాదని, దీని వెనుక కుట్ర దాగి ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. ఓ వ్యక్తి ఒక వస్తువును విసిరేయడం, అది పడిన తర్వాత మంటలు చెలరేగడం వంటి విస్తుగొలిపే దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.
రైళ్లలో ఇటీవల జరిగిన వరుస అగ్నిప్రమాదాల వెనుక కుట్ర ఉందని రైల్వే శాఖ తెలిపింది. అసాంఘిక శక్తుల ప్రమేయం ఇందులో ఉందని తమ ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనట్టు పేర్కొంది.
మధ్యప్రదేశ్లో ఆదివారం రాజధాని ఎక్స్ప్రెస్ రైలులో అగ్నిప్రమాదం జరిగిన ఘటన మరువకముందే మరోకటి చోటు చేసుకుంది. బిహార్లోని ససారంలో రైలులో అగ్ని ప్రమాదం సంభవించింది.
నంద్యాల జిల్లా సంజామల మండలం రెడ్డిపల్లి వద్ద రైలు ప్రమాదం సంభవించింది. వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్తూ రైల్వే ట్రాక్ దాటుతున్న రైతును రైలు ఢీకొట్టింది.
సాధారణంగా రైలు వస్తున్న సమయంలో పట్టాల పైకి ఏ వాహనాలూ వెళ్లకుండా గేట్లు వేస్తారు. రైలు వెళ్లి పోయే వరకు గేట్ బయట వాహనాలు ఆగి ఉంటాయి. అయితే ఝార్ఖండ్లో ఓ రైల్వే గేట్ వద్ద ఒళ్లు గగుర్పొడిచే ప్రమాదం చోటు చేసుకుంది.
థాయ్లాండ్లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. రైలుపై క్రేన్ కూలి పడటంతో అది పట్టాలు తప్పింది. ఈ ఘటనలో దాదాపు 22 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. కాగా 30 మందికి పైగా తీవ్ర గాయపడ్డారు.
ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ ప్రమాదంలో రెండు బోగీలు పూర్తిగా కాలిపోయాయి. ఆ మంటల్లో విజయవాడకు చెందిన చంద్రశేఖర్ సుందర్ (70) అనే వ్యక్తి చిక్కుకుని సజీవ దహనమయ్యారు. మిగిలిన ప్రయాణికులు అందరూ కిందకు దిగిపోయి తమ ప్రాణాలను కాపాడుకున్నారు