Share News

AP Election 2024: నేను సీఎం కావడం కొంత మందికి ఇష్టం లేదు: కేఏ పాల్

ABN , Publish Date - Apr 05 , 2024 | 03:14 PM

లోక్‌సభ ఎన్నికలు-2024లో (Lok Sabha Polls) విశాఖపట్నం పార్లమెంట్ స్థానం నుంచి బరిలోకి దిగిన ప్రజాశాంతి (Prajasanthi) పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను సీఎం కావడం కొంత మందికి ఇష్టం లేదని అన్నారు. ‘‘ నేను సీఎం అయితే 13 లక్షల కోట్ల రూపాయల అప్పు తీరిపోతుంది. ప్రజలను బానిసలుగా ఉంచాలని పాలకులు చూస్తున్నారు ’’ అని అన్నారు.

AP Election 2024: నేను సీఎం కావడం కొంత మందికి ఇష్టం లేదు: కేఏ పాల్

విశాఖపట్నం: లోక్‌సభ ఎన్నికలు-2024లో (Lok Sabha Polls) విశాఖపట్నం పార్లమెంట్ స్థానం నుంచి బరిలోకి దిగిన ప్రజాశాంతి (Prajasanthi) పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను సీఎం కావడం కొంత మందికి ఇష్టం లేదని అన్నారు. ‘‘ నేను సీఎం అయితే 13 లక్షల కోట్ల రూపాయల అప్పు తీరిపోతుంది. ప్రజలను బానిసలుగా ఉంచాలని పాలకులు చూస్తున్నారు. 7 ప్రధాన అంశాలతో ఎన్నికల్లోకి వెళ్తాం. మంచి పాలన కోసం ప్రజాశాంతి పార్టీకి పట్టం కట్టండి. అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీకి విశాఖను రాజధానిగా చేస్తాను. ఐదేళ్లలో విశాఖను వాషింగ్టన్ డీసీకి ధీటుగా అభివృద్ధి చేసి చూపిస్తా. విశాఖకు లక్ష కోట్లు ఆదాయం తెస్తా. విశాఖ బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ చేస్’’ అని కేఏ పాల్ అన్నారు.


ఇక తన పోరాటం కారణంగానే ఏప్రిల్‌లో జరగాల్సిన ఎన్నికలు మే నెలలో జరగబోతున్నాయని కేఏ పాల్ అన్నారు. ఉత్తరాంధ్రలో ఏటా 2 లక్షల ఉద్యోగాలు వచ్చేలా చేస్తానన్నారు. విశాఖను డ్రగ్, మాదక ద్రవ్యాలు రహిత నగరంగా మార్చివేస్తానని కేఏ పాల్ వాగ్దానం చేశారు. స్టీల్ ప్లాంట్ కోర్ కమిటీలో కొందరు అమ్ముడు పోయారని ఆరోపించిన ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుతామని అన్నారు. ఎన్నికలకు సంబంధం లేకుండా విశాఖ ఉక్కును కాపాడమే తన లక్ష్యమని ఈ సందర్భంగా పాల్ పేర్కొన్నారు.


ప్రజాశాంతి ఆఫీసులో ప్రెస్‌మీట్ పెట్టకూడదని చెప్పడం ఎంటి? అని పాల్ ప్రశ్నించారు. అధికారుల ప్రవర్తన చట్టానికి విరుద్ధమని అన్నారు. ఇక తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా 8 సార్లు ఆర్డర్లు తెచ్చానని అన్నారు. తాను 10వ తరగతి ఫెయిల్ అయ్యానని, డిగ్రీ మధ్యలో ఆపేశానని, తనపై ఒక్క అవినీతి కేసు కూడా లేదని అన్నారు.

ఇవి కూడా చదవండి

AP Elections: వైసీపీకి బిగ్ షాక్.. టీడీపీలో చేరిన గుంటూరు, అనంత కీలక నేతలు

Chandrababu: ఆ మాట నేను చెప్పాకే పెన్షన్లు ఇస్తున్నారు.. వైసీపీ సర్కార్‌ను ఏకిపారేసిన చంద్రబాబు

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 05 , 2024 | 03:40 PM